
*మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం*
*మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, నవంబర్ 18 (మన ప్రజావాణి)*:
నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలో నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం, జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా దేశ అభ్యున్నతి కోసం పాటు పడాలి అని తమ భవిష్యత్తు మీద దృష్టి సాధించాలని తెలియజేయడం జరిగింది. నల్లమందు, హెరాయిన్, కొకైన్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు వివిధ సంకేత నమూనాలతో నల్ల బజార్ లో చలామణి అవుతున్నాయి. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోతున్నారు. ఒక్కసారి బానిసలు అయితే ఎంతటి నేరాలు చేయడానికి అయినా వెనుకాడరు. మాదకద్రవ్యాలు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్న వారు, వ్యసనపరులు చట్టపరంగా కఠినంగా శిక్ష అర్హులు. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీదయే దృష్టిని కేంద్రీకరిస్తూ ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ ఏ కోటేశ్వర్ రెడ్డి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్వేత మున్సిపల్ మానేజర్ ఆరు అరుణ కుమారి, టీచర్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం అరవింద్ రెడ్డి, మెస్మా సిబ్బంది, బిల్ కలెక్టర్స్, వాటర్ మ్యాన్స్, ఎలక్ట్రీషియన్స్, శానిటేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.








