స్వగ్రామం చేరిన వలస జీవి మృతదేహం* రాయికల్:నవంబర్ 19(ప్రజావాణి)

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*స్వగ్రామం చేరిన వలస జీవి మృతదేహం*

రాయికల్:నవంబర్ 19(ప్రజావాణి)

ఉన్న ఊళ్ళో ఉపాధి లేక,గంపెడు ఆశతో నాలుగు పైసలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించాలని విదేశాలకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస జీవి శవపేటికలో శవమై బుధవారం ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాయికల్ పట్టణానికి చెందిన సుతారి ధర్మయ్య అలియాస్ తోట ధర్మయ్య సౌదీ అరేబియా దేశంలో జెద్దాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ధర్మయ్య పొట్ట చేత పట్టుకుని 10 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు.అప్పటి నుండి అక్కడే పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే పని చేసుకుని రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై మృతి చెందాడని తోటి కార్మికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.కాగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సాటా రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ,సాటా కోర్ టీం సభ్యులు సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడి కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సహాయంతో హైదరాబాద్ నుండి రాయికల్ వరకు ఉచిత అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకురావడానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి ధర్మయ్య అంత్యక్రియల వరకు అన్ని ఏర్పాట్లను వారు చూసుకున్నారు.మృతుడికి భార్య,కుమారుడు, కూతురు ఉన్నారు.నిరుపేద మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సాటా రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ,కోర్ టీం సభ్యులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share