
*అక్రమం ఆగనంటుంది….?
*గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..?
*పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..?
*గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..?
*పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..?
*అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .?
*రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి…?
రెవెన్యూ అధికారుల ఆదేశాలతో ఆగ మేఘాల మీద తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న “మట్టి డాన్”..
రెవెన్యూ ఇన్స్పెక్టర్ను వెంటబెట్టుకొని వెళ్లిన” మట్టి డాన్”
మన ప్రజావాణి ప్రత్యేక కథనం…1
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదు.. కానీ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మట్టి వ్యాపారం నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ రైతు ఆరు నెల క్రితం లెవలింగ్ పేరుతో లక్షలది రూపాయలు వ్యాపారం చేసిన వ్యవహారంపై మన ప్రజావాణి ప్రత్యేక కథనాలు అందించిన సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగాలకు తెలిసిందే. ప్రధానంగా నే లకొండపల్లి -కూసుమంచి ప్రధాన రహదారిలోని అమ్మగూడెం పెట్రోల్ బంకు సమీపంలో ఓ రైతు వ్యవసాయ భావి అంటూ.. లీజుకు తీసుకొని మట్టి వ్యాపారం చేస్తున్నట్లు గ్రామస్తులు మండల ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మన ప్రజావాణి కీలక ఆధారాలు సేకరించి సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ అల్లం రవికుమార్ వివరణ కోరగా క్షేత్రస్థాయిలో మట్టి మాఫియా డాన్తో కలిసి వెళ్లిన దృశ్యాలు మన ప్రజావాణి నిఘా నేత్రానికి చిక్కాయి. నాడు ఇదే మండలంలోని దళితుల భూముల విషయంలో నాటి తాహ సిల్దార్ బదిలీ జరిగిన వ్యవహారం మరువక సాక్షాత్తు తహసిల్దారు ముందు చర్చలు జరిపిన దృశ్యాలు ఆపై జరిగిన పరిణామాలపై.. సమగ్ర సంచలన కథనం రేపటి సంచికలో….!







