FLASH NEWS

*జిల్లాతో నాకెంతో ప్రత్యేక అనుబంధం* *సంగారెడ్డి కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న ప్రావీణ్య*

*జిల్లాతో నాకెంతో ప్రత్యేక అనుబంధం* *సంగారెడ్డి కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న ప్రావీణ్య* *హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం* హనుమకొండ జిల్లా ప్రతినిధి //మన ప్రజావాణి హనుమకొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ గా పని చేసిన ఈ ప్రాంతం తనకేంతో ప్రత్యేకమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న పి.ప్రావీణ్య అన్నారు.ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న పి.ప్రావీణ్య ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన బెంగళూరు తర్వాత ఎక్కువ కాలం ఉన్న ప్రాంతం ఇదేనని పేర్కొన్నారు. జీవితంలో ఈ ప్రాంతాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానని అన్నారు. మున్సిపల్ కమిషనర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ గా అందరి సహకారంతో సమన్వయంతో పనిచేయడం పట్ల జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు క్రమం తప్పకుండా అధికారులతో సమావేశాలను నిర్వహించడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉండడంతో తరచుగా తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఎక్కువ సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని విజయవంతంగా అమలు చేయడంలో అధికారులు, ఉద్యోగులు ఎంతో సహకరించారని పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు, సమావేశాలు అధికారులు, ఉద్యోగులతో విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రభుత్వ పథకాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడంలో అందరి సహకారం ఉందన్నారు. తన దృష్టికి ఏ విషయం వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదన్నారు. మున్సిపల్ కమిషనర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ గా దీర్ఘకాలం పనిచేసిన ఈ ప్రాంతాన్ని జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానని అన్నారు. ఎక్కడ ఉన్నా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. పరిపాలనలో జిల్లా ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, నాయకులకు పేరుపేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో అగ్రపథంలో నిలిపేందుకు కలెక్టర్ ప్రావీణ్య ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయా శాఖలను, అధికారులు, ఉద్యోగులను ముందుకు నడిపించారని అన్నారు.ఆత్మీయ వీడ్కోలు సమావేశం అనంతరం వివిధ శాఖల అధికారులు, టీజీవో, టీఎన్జీవో, వివిధ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గజమాలలు, పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా అధికారి శ్రీనివాస్ కుమార్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు, టీఎన్జీవో అధ్యక్షుడు ఆకుల రాజేందర్, ఇతర సంఘాల నాయకులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

*సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం*

*సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జూన్ 13 (మన ప్రజావాణి)*: చండూరు మండలం పరిధిలోని ధోనిపాముల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో భాగంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా చేరిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు జి సులోచన, గ్రామ విలేజ్ సెక్రటరీ అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు ఝాన్సీరాణి, అనిత, రజిత, అంగన్వాడి ఉపాధ్యాయులు తారక, నాగలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా లో హత్య కలకలం.

రాజన్న సిరిసిల్ల జిల్లా లో హత్య కలకలం. మన ప్రజావాణి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం: గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన సతీష్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఘటన కు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…? మన ప్రజావాణి ప్రత్యేక కథనం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మన ప్రజావాణి టైర్లను బట్టి రేట్లు ఉంటాయి ఇక్కడ ఓ బిల్ల చూపిస్తే చాలు రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ.. అంతా మామూళ్ల మత్తుతో జోగుతున్న చెక్పోస్ట్ అధికారులు సిబ్బంది.. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు అశ్వరావుపేట చెక్పోస్ట్ సిబ్బంది అవినీతికి హద్దు పద్దు లేకుండా కొనసాగుతోంది. ఎన్నిసార్లు ఏసీబీ దాడులు నిర్వహించిన సంబంధిత అధికారులు తమ తీరును మార్చుకోకపోవడం విశేషం. ఆరు టైటిల్ వాహనానికి 200 రూపాయలు అదే పది టైర్ల లారీ కానీ వాహనం అయితే 400 12 టైర్ల లారీలకు వాహనాలకు 600 14 టైర్లకు 500 16 నుండి మాత్రం 800 నుంచి 1000 రూపాయల దాకా సమర్పించుకున్న తరువాతనే వాహనాలు అటు వెళ్లాలన్నా ఇటు రావాలన్నా ముడుపులు ముట్ట చెప్పాల్సిందే. ఇది నిత్యం షిఫ్టులు వారీగా జరుగుతున్న యదార్థం మని ఆంధ్ర తెలంగాణ వాహనదారులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు సుమారు రెండు లక్షల రూపాయల మేర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చేపల వాహనాలు దానా పశువులు రవాణా ఏదైనా ముడుపులు చెల్లించాల్సిందేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చెక్ పోస్ట్ ఇంచార్జ్ జనార్దన్ రెడ్డి మాత్రం ఆ దరిదాపుల్లో కనిపించారు కానీ వ్యవహారమంతా చెక్ పోస్ట్ సిబ్బంది అధికారులు నిర్ణయించిన రేట్లు ప్రకారం ముడుపులు చెల్లించుకొని ముందుకు వెళ్లాలన్నా వెళ్ళకు రావాలన్నా ఇదే రూల్ ఇదే సిద్ధాంతం. అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్న సంబంధిత రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి అధికారులు స్పందించకపోవడం దృష్టి కేంద్రీకరించకపోవడం విశేషం. *ప్రైవేటు వ్యక్తుల పహారాలో వసూళ్ల పర్వం..? కాగా షిఫ్టుల వారీగా విధులు నిర్వహించే సిబ్బంది అధికారులు కాసులకు కక్కుర్తి పడి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేసి లెక్క ప్రకారం ఆయా షిఫ్టులో ఉన్న సిబ్బందికి అధికారులకు లెక్క ప్రకారం అప్పగిస్తూ నిత్యం ఇదే తీరుగా వ్యవహరిస్తున్నట్లు వాహనదారులు యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను సైన్యంగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చెక్ పోస్ట్ నిర్వాహకులపై లారీ యజమానులు వాహనదారులు అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు అశ్వరావుపేట అక్రమంగా వస్తువులపై దృష్టి కేంద్రీకరించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు యజమానులు కోరుతున్నారు.. మరికొన్ని అక్రమ దందాలపై తరువాయి కథనంలో వేచి చూడండి…2లో….!

చెరువు శిఖం భూమి ఆక్రమణ..! బానిస “సంకెళ్లు” దేవుడు ఎరుగు…? చెరువు శిఖం నాలుగెకరాల కబ్జాకు రంగం సిద్ధం..?

చెరువు శిఖం భూమి ఆక్రమణ..! బానిస “సంకెళ్లు” దేవుడు ఎరుగు…? చెరువు శిఖం నాలుగెకరాల కబ్జాకు రంగం సిద్ధం..? ఎంత బడా బాబు అయితే మాత్రం.. ఇదేం నిర్వాకం..? మరో పంచాయతీ కార్యదర్శి కారు చౌకగా చెరువును లీజుకి ఇస్తారు ఇక్కడ…? ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ ఈ అక్రమాల మాటేమిటి…? అసహనం వ్యక్తం చేస్తున్న రెండు గ్రామాల ప్రజలు మన ప్రజావాణి “ప్రత్యేక” వరుస కథనం…1 ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చెరువు శిఖం భూమిని సుమారు నాలుగు ఎకరాలు ఆక్రమించి దర్జాగా ఈ ఏడాది సాగు చేసుకునేందుకు కట్టలు పోపించి రంగం సిద్ధం చేసిన వ్యవహారం ఆ మండలంలో సంచలనంగా మారింది. స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టి పోరాడిన నాటి బడా బాబు నేడు తన గ్రామానికి సమీపంలోని ఓ చెరువును ఆక్రమించి సుమారు నాలుగు ఎకరాలను గుప్పెట్లో పెట్టుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయంటూ ఏకంగా చెరువులో సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవహారం పరిసర గ్రామాలలో కలకలం రేపింది. స్వతంత్ర సంగ్రామంలో తనతో పాటు కొందరు పాల్గొన్నారని వారికి కూడా తనకున్న పరపతి పలుకుబడితో పెన్షన్లు మంజూరు అయ్యేటట్లు ప్రయత్నం చేసిన బడా బాబు ఓ మండల కేంద్రంలో మూడు నివాస గృహాలతో పాటు మరో నివాసగృహాన్ని నిర్మిస్తున్న ఘనుడు. అయినప్పటికీ తీసుకున్నది ప్రభుత్వ పెన్షన్ అయిన ఆదర్శంగా ఉండాల్సిన ఆ బడా బాబు రెండు గ్రామాలకు చెరువు ద్వారా సాగుకు ఉపయోగపడే చెరువును తన కబంధ హస్తాలలో బందీ చేసి నాలుగు ఎకరాలను స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేయటం అధికారుల పనితీరును తెలియజేస్తుందని పలువురు సన్నా చిన్నకారు రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపున ప్రభుత్వం చెరువులు కుంటలు ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో ఆ బడా బాబు చేసే నిర్వాకంతో ప్రభుత్వ లక్ష్యం నీరు కారిపోతుందని పలువురు రైతులు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ గ్రామపంచాయతీలోని చెరువును ఒకవైపు బడా బాబు ఆక్రమించి హస్త గతం చేసుకుంటుంటే.. మరోవైపు ఆ చెరువును నామమాత్రం ధరకు సుమారు 20వేల రూపాయలకు చెరువును గుప్పెట్లో పెట్టారు. గతంలో కూడా సదరు వ్యక్తికి చేపలకు లీజుకు ఇచ్చినట్లు అదే వ్యక్తికి మళ్లీ సదరు పంచాయతీ అధికారులు కట్టబెట్టినట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొన్ని అంశాలతో.. రెండవ ఎపిసోడ్లో వేచి చూడండి…!

రిటైర్డ్ పెన్షనర్స్ భవనం అద్దె ఎవరి ఖాతాలో చేరుతున్నది..?

రిటైర్డ్ పెన్షనర్స్ భవనం అద్దె ఎవరి ఖాతాలో చేరుతున్నది..? రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు సమాధానం చెప్పాలి భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్ మంథని: మన ప్రజావాణి జూన్ 10 పెద్దపల్లి జిల్లా మంథని కోర్టుకు ఎదురుగా నిర్మించిన రిటైర్డ్ పెన్షనర్స్ భవనం ఎవరి ఆధీనంలో నిర్వహించబడుతుందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి అట్లా శివకుమార్ ప్రశ్నించారు. రిటైర్డ్ పెన్షనర్స్ భవనం నిర్వహణ వలన రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలోని ఎంతమంది నాయకులు లాభపడుతున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయని రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘ నాయకులను సూటిగా ప్రశ్నించారు.ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేశారా? లేక ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రిటైర్డ్ పెన్షనర్స్ భవనాన్ని నిర్మించారో తెలియదు కానీ పేరుకు మాత్రమే రిటైర్డ్ పెన్షనర్స్ భవనంగా కొనసాగుతున్నదని అన్నారు. అందులో కొనసాగేది మాత్రం ప్రైవేటు వ్యక్తుల సొంత లాభాల వ్యాపారం అని మండిపడ్డారు. రిటైర్డ్ పెన్షనర్స్ పేరుతో ఏర్పాటు చేసిన భవనాన్ని రిటైర్డ్ పెన్షనర్స్ అవసరాల కోసం ఉపయోగించకుండా ప్రైవేట్ వ్యక్తులకు కిరాయికి ఇచ్చి కిరాయి ద్వారా వచ్చే సొమ్మును రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం లోని కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు తమ సొంతానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు.రిటైర్డ్ పెన్షనర్స్ భవనం దూర ప్రాంతాల నుంచి వచ్చే పెన్షనర్స్ కు ఉపయోగపడడం లేదని అన్నారు. సంఘంలో సభ్యత్వం పొందిన రిటైర్డ్ ఉద్యోగులు తమ అవసరాలరీత్యా మంథని పట్టణ ప్రాంతానికి వచ్చినప్పుడు రిటైర్డ్ పెన్షనర్స్ భవనం అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. మంథని చౌరస్తాలోనే ఏదో ఒక హోటల్లో తమ పెన్షన్ కు సంబంధించినటువంటి దరఖాస్తులను నింపుకొనే దుస్థితి ఉందని అన్నారు. ఏదో ఒక నీడన తమ కాగితాలను సరిచూసుకొని సంబంధిత ఆఫీసులో అప్పగించి అలసటతో వెనుతిరిగి వెళ్తున్నారని అన్నారు. రిటైర్డ్ పెన్షనర్స్ ఉద్యోగుల సంఘం నాయకులు రిటైర్డ్ ఉద్యోగస్తుల నుండి ప్రతి సంవత్సరం సభ్యత్వ రుసుము వసూలు చేసినప్పటికీ రిటైర్డ్ ఉద్యోగస్తులకి రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో మాత్రం కూర్చునే అదృష్టాన్ని ఎందుకు కలిగించడం లేదని నిలదీశారు. అంతేకాకుండా రిటైర్డ్ పెన్షనర్స్ భవనాన్ని ఇతర వ్యక్తులకు కిరాయి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులను కూడా సంఘం యొక్క అవసరాలకు గానీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు గానీ ఉపయోగించడం లేదని అన్నారు. సంఘ భవనం కిరాయి ద్వారా వచ్చే డబ్బులను సంఘంలోని కొంతమంది నాయకులు తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని సంఘంలోని కొంతమంది విశ్రాంత ఉద్యోగస్తులు వాపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో ఒక గదిని రిటైర్డ్ పెన్షన్ దారులు తమ కనీస అవసరాల కోసం ఉపయోగించుకునేలా తయారు చేయాలని కోరారు. రిటైర్డ్ పెన్షనర్లు అందులో వారికి కావలసిన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారనీ తెలిపారు. విశ్రాంత ఉద్యోగస్తులకు ఉపయోగపడని రిటైర్డ్ పెన్షనర్స్ భవనాన్ని పూర్తిగా మూసివేసి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘంలో సభ్యత్వం పొందిన కొంతమంది రిటైర్డ్ ఉద్యోగస్తులు తమలో తామే చర్చించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్ తెలియజేశారు.

రవాణా శాఖనీ అవినీతి అక్రమ వసూళ్ళ శాఖ గా మార్చిన అశ్వారావుపేట చెక్ పోస్ట్ అధికారులు…? ఎన్నో ఏసీబీ దాడులు అయినా తీరు మార్చుకొని అశ్వారావుపేట చెక్ పోస్ట్ సిబ్బంది…?

రవాణా శాఖనీ అవినీతి అక్రమ వసూళ్ళ శాఖ గా మార్చిన అశ్వారావుపేట చెక్ పోస్ట్ అధికారులు…? ఎన్నో ఏసీబీ దాడులు అయినా తీరు మార్చుకొని అశ్వారావుపేట చెక్ పోస్ట్ సిబ్బంది…? అసలు చెక్ పోస్ట్ లో బైట వ్యక్తులని పెట్టి వసూళ్లు చేపించడానికి ఎవరిచ్చారు అధికారం…? విచ్చలవిడిగా వసూళ్లు నోరు మేధపని జిల్లా అధికారి వాటా పుచ్చుకుంటున్నాడు కదా…? పలువురు అక్రమ ట్రాన్స్పోర్టర్లు మంత్లీలు సైతం సమర్పించుకుంటారు ఇక్కడ ఒక బిళ్ళ చూపిస్తే చాలు రైట్ డాక్యుమెంట్ తో పని లేదు…? చెక్ పోస్ట్ ఇంచార్జ్ జనార్దన్ రెడ్డి మాత్రం ధరి దాపులో కూడా కనపడరు…? లారీ టైర్లు ఎన్నో చెప్పు డైరెక్ట్ గా సమర్పించుకొ 6 టైర్లకి 200 10 టైర్లకి అయితే 400 12 టైర్లకి 600 14 కి 500 16 కి 800 నుంచి 1000 రూపాయలు మేర సమర్పించుకోవాల్సిందే ఇది అశ్వారావుపేట చెక్ పోస్ట్ లో వసూళ్ళ లెక్క…? మరొక్క మారు అశ్వారావుపేట చెక్ పోస్ట్ పై ఏసీబీ ద్రుష్టి సారించాలి అని పలువురు లారీ డ్రైవర్లు కోరుకుంటున్నారు… ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిది జూన్ 11 (మనప్రజవాని)

గుర్తు తెలియని మృతి దేహం లభ్యం. ••సిరిసిల్లలో పాత బస్సు స్టాండు వద్ద మగ శవం.

సిరిసిల్ల //మన ప్రజావాణి గుర్తు తెలియని మగ శవం సిరిసిల్ల పాత బస్టాండ్ లో లభ్యమైందని పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం….. సిరిసిల్లలో లభ్యమైన మృతుని వయస్సు అందాదా 45-55 సంవసరాలు ఉంటుందని మృతుడు ఎరుపు, నలుపు, రంగు గీతలు గల టీ – షర్ట్, నలుపు రంగు నైట్ ప్యాంట్ దరించి ఉన్నాడని అన్నారు. మృతుని ఎత్తు అందాదా 5.6 ఫీట్స్ కలడు.మృతుని శవము సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గది నందు మార్చారు.మృతున్ని ఎవరైనా గుర్తించిన అతడి వివరాలు తెలిసిన సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఈ క్రింది ఫోన్ నంబర్స్ కి సమాచారం తెలుపగలరని సిఐ తెలిపారు. సంప్రదించవల్సిన నం:-*8712656366* *8712656367*

.మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!! ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి మత్స్యకారుల ప్రయోజనాలను మంటలో కలిపి బంధుప్రీతి లంచాలు పరమ అవధిగా మారి అవినీతికి చిరునామాగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య కోఆపరేటివ్ సహకార సంఘంపై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు విచారణలు జరిగి వేటుకు రంగం సిద్ధం చేసి రాష్ట్ర జిల్లా అధికారులు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఊసరవెల్లి ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను విస్మరించి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసి అడ్డంగా బుక్కై న ప్రయత్నాలు మాత్రం ఆగటం లేదు. అధికార యంత్రాంగాలను వ్యవస్థలను ప్రసన్నం చేసుకునే సత్తా శక్తి ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన పాలకవర్గ అధ్యక్షులు కార్యదర్శి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి దండిగా దండుకోనీ ఏమి ఎరగనట్లుగా వ్యవహరిస్తున్న వ్యవహారంపై మన ప్రజావాణి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో తూటి పల్లి వీరభద్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదుల ఆధారంగా బాధితుల మనోవేదన ఆగ్రహం ఆక్రందన లపై గత కొంతకాలంగా సంచలన కథనాలను మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో హై డ్రామా నెలకొన్నది. వార్త కథనాలకు స్పందించిన రాష్ట్ర జిల్లా స్థాయి యంత్రాంగాలు ఉదయం 10 గంటల లోపు మత్స్య సహకార సంఘానికి అధికారికంగా నోటీసులు జారీ చేయడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గత మూడు సంవత్సరాల నుండి వసూలు రాజాగా మారి మత్స్యకారులను పీల్చి పిప్పి చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పనిచేసిన మాజీ అధ్యక్షుడు కార్యదర్శి సూచనల మేరకు వసూలు చేసి అడ్డంగా బుక్ అయినట్లు మత్స్యకారులు గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి చాపల చెరువు వ్యవహారంలో గతం నుండి నేటి వరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మత్స్యకారులను అన్యాయం చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర సామాజిక వర్గాలకు పెద్దపీట వేసిన వ్యవహారం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. గతంలో పనిచేసి వేటుపడిన మత్స్య శాఖ సహాయ సంచాలకురాలు సుమారు 21 గ్రామాల లోని మత్స్యకార సొసైటీల రికార్డులను గల్లంతు చేసినట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. పందిళ్ళపల్లి వ్యవహారం జిల్లా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు జిల్లా మత్స్యకారులు బాధితులు అంటున్నారు.

ఏసీబీ వలలో పురాపాలక కంప్యూటరు ఆపరేటర్ మరియు వార్డ్ కార్యాలయంలోని బిల్ కలెక్టర్

మన ప్రజావాణి స్టేట్ బ్యూరో// ఫిర్యాదుదారుని గృహానికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి” అధికారికంగా సహాయం చేసినందుకు అతని నుండి రూ .20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని తూముకుంట పురాపాలక కార్యాలయంలోని కంప్యూటరు ఆపరేటర్ – ఎ. శ్రావణ్ మరియు షామీర్ పేట వార్డ్ కార్యాలయంలోని బిల్ కలెక్టర్ – కె. రాంరెడ్డి. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును

 Share

 నోటిఫికేషన్స్

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?