FLASH NEWS

ఏసీబీకి చిక్కిన తూనికలు కొలతల శాఖ ఖమ్మం జిల్లా అధికారి

ఏసీబీకి చిక్కిన తూనికలు కొలతల శాఖ ఖమ్మం జిల్లా అధికారి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తూనికలు కొలతల శాఖ ఖమ్మం జిల్లా అధికారి ప్రవీణ్ కుమార్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వేబ్రిడ్జి ధ్రువీకరణ పత్రం కోసం ఓ ఏజెంట్ నుంచి రూ.10 వేలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనతో కార్యాలయంలో నగదు అందజేస్తుండగా డీఎస్పీ రమేశ్ బృందం దాడి చేసి పట్టుకుంది.

మండల స్థాయి సీఎం కప్ ఎంపికలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి దొండ కృపాకర్

మండల స్థాయి సీఎం కప్ ఎంపికలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి దొండ కృపాకర్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జనవరి 29 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ (సెకండ్ ఎడిషన్) కు, ఎంపికలు జనవరి 30 శుక్రవారం రోజున నిర్వహించబడతాయని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడిఓ) దొండ కృపాకర్ పత్రికా ప్రకటనలగా తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ఆసక్తిగల ఆడ, మగ క్రీడాకారులు పాల్గొనవచ్చునని, ఎంపికకు వచ్చేవారు ఆన్లైన్ చేసుకున్న ధృవపత్రమును, ఆధార్ కార్డు తదితర జిరాక్స్ లు తీసుకొని జనవరి 30 శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎండపెల్లి హైస్కూల్లో సమర్పించాలని తెలియజేశారు. ఇందులో నిర్వహించే క్రీడలు: 1. కోకో 2. కబడ్డీ 3. వాలీబాల్ 4. అథ్లెటిక్స్ 5. ఇతర క్రీడా సెలెక్షన్స్ నిర్వహించబడునని. మరిన్ని వివరాలకై పిడి క్రిష్ణవేణి సెల్ 9492362517 సంప్రదించాలని ఎంపిడిఓ కృపాకర్ కోరారు.

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

*బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..? సర్వే చేశామంటారు సరిహద్దులు నిర్ణయించామంటారు.. కానీ మళ్ళీ కొనసాగుతున్న అక్రమం *సర్వే ప్రకారం పంచాయతీకి అప్పగిస్తే చర్యలు తీసుకుంటామంటూ పంచాయతీ కార్యదర్శి వివరణ ఇంతకీ…! బైరాగి గుట్టలో ఏం జరుగుతోంది *దేవాలయ భూములకు ఏ సరు పెడుతున్న పత్తాలేని ఈవో…? ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని బైరాగి గుట్ట అడ్డాలో ఓ అక్రమార్కుడు కొనుగోలు చేసిన భూమిక అంటే అదనంగా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ భూమి అభివృద్ధి పనులు దర్జాగా నెల రోజులుగా అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదని భక్తులు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మండల కేంద్రానికి చెందిన రెవెన్యూలో సుమారు 8 ఎకరాలు ప్రభుత్వ దేవాలయ భూమి ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కాగా దేవాదాయ ధర్మాదాయ రెవెన్యూ మైనింగ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లు అక్రమాలను అడ్డుకునే చర్యలు చేయకపోవడం విశేషం. పైగా ఇటీవల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి హద్దులు నిర్ణయించి హడావుడి చేశారు అయినప్పటికీ అక్రమార్కుడు అధికారులను కలిసి చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వ భూములను కబ్జాకు ప్రయత్నిస్తే సంబంధిత వ్యక్తులకు సంస్థలకు నోటీసులు జారీ చేసి సరిహద్దులు నిర్ణయించి భూములు స్వాధీనం చేసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఆ దిశగా పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్ ను మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి వివరణ కోరగా సర్వే చేశాం పంచాయతీ కార్యదర్శులు అక్కడికి పంపిస్తామంటూ అన్నారు ఇదే విషయంపై పంచాయతీ కార్యదర్శి ని ఎవరైనా కోరేందుకు ప్రయత్నించగా మాకు సంబంధం లేదు రెవెన్యూ వారు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి లిఖితపూర్వకంగా పంచాయతీకి అప్పగిస్తే పంచాయతీ పాలకవర్గం తో చర్చించి అక్కడికి వెళ్లి స్వాధీనం చేసుకుంటామంటూ ప్రకటించారు. ఆ ప్రక్రియ మొత్తం రెవెన్యూ పరిధిలో ఉన్నది కాబట్టి రెవెన్యూ వారు స్పందించాలని బదులిచ్చారు. మరికొన్ని వివరాలతో రేపటి కథనం 2లో వేచి చూడండి..!

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…? *పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో గట్టు సింగారం భూ సమస్యకు పరిష్కారం ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన రెవెన్యూ అధికారులు. ? అక్రమాలకు అడ్డాగా కూసుమంచి రెవెన్యూ కార్యాలయం *ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు కూడా అవినీతి ఉచ్చులో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోరేందుకు..? అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కూసుమంచి మండల బాధితులు అక్రమాల పుట్ట అవినీతి గుట్ట కూసుమంచి రెవెన్యూ కార్యాలయం సాక్షిగా బాధితులకు అందని న్యాయ సహాయం ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పలు గ్రామాలలో గతంలో పనిచేసిన ఇద్దరు తాసిల్దారులు రెవిన్యూ రికార్డులను మార్చి పేదలకు రైతులకు అన్యాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అవినీతికి అక్రమాలకు పాల్పడి బాధితులకు అన్యాయం చేసినట్లు కొందరు 20 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో కూసుమంచి మండలం గట్టు సింగారం రెవిన్యూ పరిధిలోని ఓ సర్వే నెంబర్లలో సర్వే చేస్తామంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు బాధితులకు అందించి సర్వే చేయకుండా హక్కులకు భంగం కలిగించినట్లు ఆ మేరకు బాధితులు స్థానిక కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ మేరకు తెలుస్తోంది. సర్వే అడ్డుకుంటున్నట్లు సంబంధిత మండల సర్వే బాధితులకు వ్యతిరేకంగా చర్చలు జరిపి అడ్డుకునేటట్లు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. వచ్చామా వెళ్లేమా అనే విధంగా రెవెన్యూ అధికారులు సర్వేలు వ్యవహరించడం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఇదే విషయంపై కూసుమంచి తాహ సిల్దార్ రవికుమార్ ను సంప్రదించేందుకు ప్రయత్నించగా విశేషం ఇదే భూమి విషయంపై మన ప్రజావాణి అనేక సంచలన కథనాలు అందించిన సంగతి అధికార యంత్రాంగాలకు ఉమ్మడి జిల్లా పాఠకులకు తెలిసిందే. నాటి ప్రభుత్వ హయాంలో ధరణిలో లోపాల వలన భూభారతి చట్టం చేశారు ప్రస్తుతం అమలులో ఉన్న నేపథ్యంలో హక్కు కలిగిన పేదలకు బాధితులకు రెవెన్యూ అధికారుల తీరు వలన తీరని అన్యాయం జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్వే నిర్వహించేటట్లు బాధితులకు న్యాయం దక్కేటట్లు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు ప్రజాసంఘాల నేతలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

*అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి…? రెవెన్యూ అధికారుల ఆదేశాలతో ఆగ మేఘాల మీద తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న “మట్టి డాన్”.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ను వెంటబెట్టుకొని వెళ్లిన” మట్టి డాన్” మన ప్రజావాణి ప్రత్యేక కథనం…1 ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదు.. కానీ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మట్టి వ్యాపారం నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ రైతు ఆరు నెల క్రితం లెవలింగ్ పేరుతో లక్షలది రూపాయలు వ్యాపారం చేసిన వ్యవహారంపై మన ప్రజావాణి ప్రత్యేక కథనాలు అందించిన సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగాలకు తెలిసిందే. ప్రధానంగా నే లకొండపల్లి -కూసుమంచి ప్రధాన రహదారిలోని అమ్మగూడెం పెట్రోల్ బంకు సమీపంలో ఓ రైతు వ్యవసాయ భావి అంటూ.. లీజుకు తీసుకొని మట్టి వ్యాపారం చేస్తున్నట్లు గ్రామస్తులు మండల ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మన ప్రజావాణి కీలక ఆధారాలు సేకరించి సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ అల్లం రవికుమార్ వివరణ కోరగా క్షేత్రస్థాయిలో మట్టి మాఫియా డాన్తో కలిసి వెళ్లిన దృశ్యాలు మన ప్రజావాణి నిఘా నేత్రానికి చిక్కాయి. నాడు ఇదే మండలంలోని దళితుల భూముల విషయంలో నాటి తాహ సిల్దార్ బదిలీ జరిగిన వ్యవహారం మరువక సాక్షాత్తు తహసిల్దారు ముందు చర్చలు జరిపిన దృశ్యాలు ఆపై జరిగిన పరిణామాలపై.. సమగ్ర సంచలన కథనం రేపటి సంచికలో….!

చోరికి గురైన గ్లామర్ బైక్ బైక్ వెనకాల “విశ్వకర్మ” అనే ఆనవం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జనవరి 20 (మన ప్రజావాణి):

చోరికి గురైన గ్లామర్ బైక్ బైక్ వెనకాల “విశ్వకర్మ” అనే ఆనవం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జనవరి 20 (మన ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో జనరల్ స్టోర్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన నర్సింగోజు రవీంద్రచారి తన ఎరుపు రంగు “హీరో గ్లామర్” TS 02 EN 3704 అను నెంబర్ గల ద్విచక్ర వాహనం అపహరణకు గురైనట్లు తెలిపారు. ఈ వాహనానికి బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ దిగువన “విశ్వకర్మ” అని ఎరుపు రంగు రేడియం తో రాసి ఉంటుందని తెలిపారు. వాహన యజమాని రవీంద్రచారి తెలిపిన వివరాల ప్రకారం…. తను రోజులాగానే షాపు నిర్వహించి సోమవారం రోజున రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో షాపు మూసివేసి రాజారాం పల్లి నుండి గోదావరిఖని వెళ్లే హైవే రూట్ సమీపంలో తను అద్దెకు ఉంటున్న ఇంటిముంది హ్యాండిల్ లాక్ చేసి, హీరో గ్లామర్ వాహనాన్ని పార్క్ చేసి గది లోపలికి వెళ్లి, ఉదయం బయటకు వచ్చి చూసేసరికి వాహనం కనిపించడం లేదని తెలిపారు. ఎవరైనా ఎరుపు రంగు “హీరో గ్లామర్” TS 02 EN 3704 నంబర్ ప్లేట్ గల వాహనం, ఆ వాహనానికి బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ దిగువన “విశ్వకర్మ” అని రాసి ఉన్న వాహనాన్ని గమనించినట్లయితే, తన సెల్ నెంబర్లు 9908328095, 9559441123 కి సమాచారం ఇవ్వవలసింది రవీంద్రచారి కోరుచున్నాడు.

గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి అన్నమయ్య జిల్లా చౌడేపల్లి జనవరి 18 అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండా మర్రి గ్రామానికి చెందిన శ్రీనివాసులు 39 గుండెపోటుతో మరణించిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు అతని భార్య ఏడాది క్రితం భర్తను వదిలేసి వెళ్లిపోవడంతో మనస్థాపంతో వేదన చెందుతుండేవాడని గ్రామస్తులు తెలియజేశారు. ఇంటి గుమ్మం ముందు ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అతనికి ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె వికలాంగుడైన కుమారుడు కలిగి ఉన్నారు. తల్లి లేక తండ్రి కూడా మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి మన ప్రజావాణి చౌడేపల్లి జనవరి 17

క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి మన ప్రజావాణి చౌడేపల్లి జనవరి 17 అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం లో క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది మండలంలోని వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి, కుమారుడు ‘తేజ’ 22 గ్రామానికి సమీపంలోని పాలెంపల్లి వద్ద క్రికెట్ టోర్నమెంట్ కు వెళ్ళాడు అక్కడ ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు సహచరులు వెంటనే అతన్ని చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పుంగనూరుకు సిఫారసు చేశారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో వైద్యుడు సిబ్బంది నిర్లక్ష్యంతో వృద్ధాప్యంలో ఉన్న ఓ మహిళ వైద్య సేవలు అందక 48 గంటలుగా నరకయాతన అనుభవించినట్లు సమాచారం అందింది. మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి సేకరించిన సమాచారం మేరకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని మేడేపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధ మహిళ మెట్ల పైనుండి కిందపడి తుంటి భాగంలో గాయాలు కావటంతో సోమవారం రాత్రి సుమారు ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వృద్ధ మహిళను బంధువులు ఆసుపత్రికి తీసుకువచ్చి చేర్పించారు. అనంతరం ఎక్సరే తీశారు అనంతరం శస్త్ర చికిత్సలు చేయాలని బంధువులకు తెలిపిన వైద్య సిబ్బంది వైద్యుడు పరీక్షల్లో తేలిన విషయాలను ఎందుకు గోప్యంగా ఉంచారని బంధువులపై మండిపడి అవమానయంగా ప్రవర్తించారని తెలుస్తోంది. కాగా సుమారు 7 8 సంవత్సరాల క్రితం భర్త ద్వారా సంక్రమించిన వ్యాధికి సానుభూతి మానవత్వం చూపించాల్సిన వైద్య సిబ్బంది వైద్యుడు ఆగా మేఘాల మీద మందులు రాసి డిశ్చార్జ్ చేసి బయటకు పంపిన వ్యవహారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంపై మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి వివరాలు సేకరించి జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ ఫోన్ లైన్ లో వివరణ కోరగా రోగుల పట్ల సేవాభావం కలిగి ఉండాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది వైద్యుడిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వివరాలు అందజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో సేకరించిన సమాచారం డిశ్చార్జి వివరాలు ఫోటోలు అందజేయడంతో సదరు సూపరిండెంట్ వైద్య సిబ్బంది వైద్యుడుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. కాగా సదరు వృద్ధ మహిళను ఖమ్మంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో బంధువులు చేర్పించడంతో అక్కడి వైద్యులు శస్త్ర చికిత్సలు చేయాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించి బాధ్యులైన సిబ్బంది వైద్యుడుపై చర్యలు తీసుకోవాలని బాధితులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…? ప్రజా ప్రభుత్వంలో ఇటువంటి నిర్లక్ష్యంపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటూ అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు…! ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధి లో మేడేపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలకు భర్త ద్వారా సుమారు 15 సంవత్సరాల క్రితం హెచ్ఐవిగా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన నేపథ్యంలో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం తోపాటు కనీసం పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. పైగా సోమవారం డ్యూటీలో ఉన్న డాక్టర్ పేరు కూడా తెలవదంటూ వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన చిత్రాలు కెమెరాలు నిక్షిప్తమయ్యాయి. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తూ అక్కడికి రండి ఇక్కడికి రండి అంటూ నానా ఇబ్బందులు పెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇదే వ్యవహారంపై జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ ను సంప్రదించినప్పటికీ అంతగా పట్టించుకోలేదని బాధితులు అంటున్న నేపథ్యం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయి అధికారులు ప్రభుత్వం స్పందించి విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ప్రజలు కోరుతున్నారు

 Share

 నోటిఫికేషన్స్

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..