వచ్చే ఏడాది భారతీయుల కోసం ఇజ్రాయెల్ ఈ-వీసా సౌకర్యం

Ramesh

Ramesh

District Chief Reporter

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య ఇజ్రాయెల్ ఈ ఏడాది భారతీయ పర్యాటకుల సంఖ్య 10,000కు చేరుతుందని ఆశిస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతీయుల కోసం ఈ-వీసా కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఓ అధికారి గురువారం ప్రకటనలో చెప్పారు. ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇండియా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, అమృత బంగేరా ప్రకారం.. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు దాదాపు 8,500 మంది భారతీయ పర్యాటకులు ఇజ్రాయెల్‌ను సందర్శించారు. ‘2018లో ఇజ్రాయెల్ 70,800 మంది భారతీయ సందర్శకులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అప్పటివరకు అత్యధిక రికార్డు. కొవిడ్-19 మహమ్మారి ప్రపంచ పర్యాటకంపై ప్రభావం చూపడంతో సందర్శకులు తగ్గారు. 2022లో మళ్లీ భారతీయుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఏడాది 30,900 మంది పర్యాటకులు ఇజ్రాయెల్ వచ్చారని ‘ ఆమె వివరించారు. ఆ తర్వాత 2023లో 41,800 మంది పర్యాటకులు వెళ్లగా, ఈ ఏడాది యుద్ధ పరిస్థితుల వల్ల జనవరి-అక్టోబర్ మధ్య 8,500 మంది భారతీయులు పర్యటించారు. ఏడాది చివరి నాటికి భారతీయ పర్యాటకుల సంఖ్య దాదాపు 10,000కు చేరుకుంటుందని మేము ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

.మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

 నోటిఫికేషన్స్

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

 Share