నెక్ట్స్ టార్గెట్ అమెరికా మిలిటరీ బేస్.. రష్యా ప్రకటన

Ramesh

Ramesh

District Chief Reporter

ఉక్రెయిన్‌పై రష్యా(Russia) విరుచుకుపడింది. అమెరికా అందించిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లను తమ దేశంపైకి ఎక్కుపెట్టినందుకు కీవ్‌పై పుతిన్ సేన ప్రతీకారం తీర్చుకుంది. తొలిసారిగా ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణితో రష్యా దాడిచేసింది. గురువారం మధ్యాహ్నం ఈ ఎటాక్ జరిగింది. ఇది జరిగిన టైంలో రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. మీడియాతో మాట్లాడుతుండగా ఆమెకు ఉన్నతస్థాయి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఖండాంతర క్షిపణి దాడి గురించి ఎలాంటి కామెంట్స్ చేయొద్దని, మౌనంగా ఉండాలని ఫోనులో ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

 

రష్యాకు 5వేల కిలోమీటర్ల దూరంలోని పోలండ్‌(Poland) దేశపు రెడ్జికోవో ప్రాంతంలో అమెరికా నవంబరు13న ప్రారంభించిన సైనిక స్థావరం(US military base)పై మారియా జఖరోవా ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని తమ దేశం అత్యాధునిక ఆయుధాలతో ధ్వంసం చేసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. రష్యా సిద్ధం చేసుకున్న ప్రధాన శత్రు లక్ష్యాల జాబితాలో పోలండ్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌ కూడా ఉందని మారియా స్పష్టం చేశారు. రష్యా, దాని పరిసర దేశాలలో అస్థిరతను సృష్టించే కుట్రతో అమెరికా సారథ్యంలోని నాటో కూటమి పోలండ్‌లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసిందని ఆమె ఆరోపించారు. రష్యా వార్నింగ్‌తో అలర్ట్ అయిన పోలండ్ కీలక ప్రకటన విడుదల చేసింది. కేవలం తమ దేశ ఆత్మరక్షణ కోసమే ఆ మిలిటరీ బేస్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అక్కడ న్యూక్లియర్ మిస్సైల్స్ లేవని తేల్చి చెప్పింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share