మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే. ఈ చిట్కాలను ట్రై చేయండి.??

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా కల్తీయే. పప్పు నుండి ఉప్పు దాకా మరియు బియ్యం నుండి కారం దాకా ఇలా అన్నింటిని కల్తీగా మారుస్తున్నారు కేటుగాళ్లు.

అలాగే ప్రజలు ప్రాణాలు ఏమైపోయినా వాళ్లకు సంబంధం లేదు. వాళ్ల జేబులు నిండితే చాలు అని భావిస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. అలాగే గోధుమ పిండిని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు. అలాగే మారిన బిజీ లైఫ్ కారణం చేత ఇన్ స్టాండ్ కోసం ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కిరాణా షాప్ లో దొరికే గోధుమ పిండినే ప్రజలు వాడుతున్నారు. ఈ గోధుమ పిండిలో కూడా కొన్ని రకాల వస్తువులు కలిపి అమ్ముతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ గోధుమ పిండిలో మైదా, మరియు ఇసుకను,చాక్ పీస్ పౌడర్ ను, అదనపు ఊకను, యూరో రూట్ పౌడర్ ఇటువంటి వాటిని కలిపి గోధుమపిండిని కల్తీ చేస్తున్నారు. ఇటువంటి పిండితో చేసిన చపాతీలను తీసుకోవడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఊరు పేరు లేని బ్రాండ్ తో పాటుగా లూజ్ గా దొరికే వాటిలో ఎలాంటి కల్తీ ఎక్కువగా జరుగుతుంది అని అంటున్నారు. ఇంతకీ మీరు వాడే గోధుమపిండి మంచిదేనా. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

– గోధుమపిండి యొక్క నాణ్యతను తెలుసుకోవటానికి మనం ముందుగా ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి. తర్వాత దానిలో రెండు చెంచాల గోధుమ పిండిని వేయాలి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి. తర్వాత ఆ గోధుమ పిండి అనేది పైకి తేలినట్టు అనిపిస్తే అది నకిలీ గోధుమపిండి అని అర్థం. ఒకవేళ ఆ పిండి నీటి అడుగుకు చేరుకుంటే అది మంచిది అని అర్థం..

– సాధారణంగా మనం చపాతీలు చేసుకునేటప్పుడు పిండిని కలుపుకుంటాం. అయితే ఈ పిండి తయారు చేసేందుకు ఎక్కువ నీరు అవసరమైనా మరియు తొందరగా పిండి అనేది మెత్తగా కాకపోయినా అది కల్తీ పిండి అని అర్థం చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు.

– ఇకపోతే గోధుమ పిండి నాణ్యతను నిమ్మకాయతో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో మూడు లేఖ నాలుగు చుక్కలు నిమ్మరసం పిండాలి. ఒకవేళ ఆ పిండిలో బుడగలు గనుక వస్తే అది కల్తీ అని అర్థం చేసుకోవాలి. కానీ దానిలో ఎటువంటి మార్పులు కనిపించకపోతే ఆ పిండి స్వచ్ఛమైనది అని అర్థం. సాధారణంగా ఈ పిండిలో చాక్ పౌడర్ ఉంటేనే బుడగలు వస్తాయి .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share