ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చికెన్ వ్యర్ధాల మాఫియా…

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చికెన్ వ్యర్ధాల మాఫియా…!

పేరుకు చెత్త కోట్లల్లో వ్యాపారం..!!

*కాసులకు ఒక కక్కుర్తి పడి పచ్చి మాంసాన్ని చేపలకు ఆహారంగా వేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్న బడా వ్యాపారులు
ప్రజావాణి వరుస కథనం..4

ఖమ్మం బ్యూరో ప్రజావాణి
మార్చి 18:

ఖమ్మం కేంద్రంగా ఆంధ్ర తెలంగాణ లో భారీ చికెన్ వ్యర్ధాల దందా గత కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతుండగా నెలనె ల లక్షలాది రూపాయలు కమిషన్ల రూపంలో కొందరు అవినీతి అధికారులకు అందుతుందనేది బహిరంగ రహస్యమేన ని పలువురు జిల్లా ప్రజలు నిపుణులు ఆరోపిస్తున్నారు.
చికెన్‌ వ్యర్థాల సేకరణకు బహిరంగ వేలం వేసిన ఖమ్మం కార్పొరేషన్ అధికారులు ఏకంగా 93 లక్షలకు ఈ పాట నిర్వహించడం జరిగిందని విశ్వాసనీయ సమాచారం మేరకు తెలిసింది.
చెత్తలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాలు కూడా కాసులు కురుపిస్తున్నాయి. కోళ్లను కోసిన అనంతరం వ్యర్థంగా పడేసే వ్యర్ధాలను ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. ఏడాదంతా ఇదే దందా. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా ఈ వ్యర్థాలను రహస్యంగా పొరుగు ఆంధ్రాలోని చేపల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను తిన్న చేపలను మనుషులు తింటే క్యానర్స్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.
చికెన్‌ వ్యర్థాల సేకరణకు బహిరంగ వేలం
ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో
ఏ ఆర్ ఫిష్ ప్రొడక్షన్స్ పేరుతో హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ సంస్థ పేరుతో ఆయేషా ట్రేడర్స్ మహమ్మద్ జాఫర్ అలీ అంబర్పేట హైదరాబాద్ వారు ఈ టెండర్ను దక్కించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యర్ధాలను ఆంధ్రకి తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ది బహిరంగ రహస్యమేనని పలువురు బహిరంగంగా అంటున్న గాని చర్యలు తీసుకునేందుకు అధికారులు తర్జన భర్జన పడుతున్న సందర్భంగా అధికారుల పనితీరును తెలియజేస్తుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఖమ్మం అర్బన్ పరిధిలో సుమారు 400 చికెన్ సెంటర్లు ఉండగా అర్బన్ పరిధి వరకు వేలం నిర్వహిస్తే రూరల్ ఏరియా పరిస్థితి ఏంటనే విమర్శలు జోరుగా సాగుతున్నాయి.
ఖమ్మం పరిసర ప్రాంతాలు ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి ముదిగొండలో జగ్గయ్యపేటకు చెందిన మల్లేశం అనే వ్యక్తి ప్రతిరోజు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా సుమారు ఒక రోజుకు రెండు నుంచి నాలుగు టన్నుల వ్యర్ధాలను నేలకొండపల్లి మీదిగా ఒక వాహనం ఖమ్మం రూరల్ నుండి ముదిగొండ మండలాల మీదుగా మరో వాహనాన్ని జగ్గయ్యపేటకు తరలించి తరలిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో బోనకల్లు చింతకాని మధిర వైరా సత్తుపల్లి కల్లూరు ఏరియాలలో విస్తృతంగా చే పల చెరువులు వెలిశాయి. చే పలు ఎదుగుదలకు ఆహారంగా చికెన్ వ్యర్ధాలు అధిక మొత్తంలో అందుబాటులో ఉండటంతో ఓ కంపెనీ పేరుట ఈ చేపలు చెరువుల వారు అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు.
కార్పొరేషన్, అర్బన్ ఏరియా కు చెందిన చికెన్ వ్యర్ధాలను వేలంపాట్లో దక్కించుకున్న కంపెనీ వారు సేకరించిన వ్యర్థాలనుచిన్న చిన్న ట్రక్కులు ద్వారా సేకరించి ఖమ్మం కేంద్రంగా నూతన కలెక్టరేట్ భవనం వెనుక వెంచర్లలో ఈ ముఠాకు చెందిన ఫామ్ హౌస్ లో రాత్రి సమయంలో కంటైనర్ల ద్వారా సుమారు ఒక రోజుకి 40 నుంచి 80 టన్నుల కోడి మాంసం వ్యర్ధాలను ఆంధ్రకు చెందిన చేపల చెరువులకు అక్రమంగా తరలిస్తు కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న గానీ పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share