
*అవయవ దానంతో నలుగురికి ప్రాణదానం చేసిన కొమ్మిడి మణెమ్మ గారు..*
తాను మరణించి నలుగురికి పునర్జన్మ….
బ్రతికి ఉండగా అందరినీ ఆప్యాయంగా, ప్రేమతో పలకరిస్తూ అందరితో కలివిడిగా ఉండే శ్రీమతి కొమ్మిడి మణెమ్మ (వయస్సు: 47) భార్త: సమ్మిరెడ్డి, మామిడాలపల్లి గ్రామం, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు తేదీ: 10/5/2025, శనివారం రోజున మానకొండూర్ మండలం పచ్చునూర్ – మామిడాలపల్లి గ్రామాల మధ్యలో మెయిన్ రోడ్డు పై పోసిన వరి ధాన్యం కుప్ప కారణంగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు బ్రెయిన్ డెడ్ అయి మరణించారు.
మరణం తరువాత కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా తన కిడ్నీలు, కళ్ళు, లివర్, ఊపిరితిత్తులు జీవన్ దాన్ అవయవదాన కేంద్రం ద్వారా అవయవదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు..🙏🙏