
తంగళ్లపెల్లి లో జీలుగు విత్తనాల పంపిణి
•• రైతులు ఈ అవకాశన్ని సద్వినియోగపరుచుకోవాలి.
••• మండల వ్యవసాయ అధికారి కే.సంజీవ్
తంగళ్లపెల్లి //మన ప్రజావాణి
తంగళ్లపెల్లి మండల కేంద్రంలో జిలుగు విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని తంగళ్ళపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…..రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ సహకార సంఘం ద్వారా 50 శాతం సబ్సిడీపై జీలుగా విత్తనాలను గురువారం రోజు అనగా 22.05.2025 నాడు ఉదయము 10 గంటలకు తేజశ్రీ గ్రామక్య సంఘం తంగళ్ళపల్లి కేంద్రాల వద్ద పంపిణి చేయడం జరుగుతుందని అన్నారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా 4275.00 రూపాయాలు.ఇందులో 50శాతం సబ్సిడీ పోను 2138.00 రూపాయాలు రైతులు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. తేజశ్రీ గ్రామైక్య సంఘం నందు 365 బ్యాగులు ఉన్నాయని,రైతు సోదరులు పట్టా పాస్బుక్, ఆధార్ కార్డ్ తీసుకువచ్చి వ్యవసాయ విస్తారణ అధికారుల చే పరిమిటి పొంది విత్తనాలు తీసుకోగలరని 2.5 ఎకారానికి ఒక బస్తా(30కేజీ) , 5 ఎకరాలకు అధికముగా 2 బస్తాలు మాత్రమే ఇవ్వబడతాయని మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల అధికారి తెలిపారు.