
*పాఠశాల అనుభవాలే భావి జీవితానికి పునాదులు*
రాయికల్: నవంబర్ 14 (ప్రజావాణి)
పాఠశాల అనుభవాలే విద్యార్థుల భావి జీవితాలకు పునాదులు వేస్తాయని పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు లో భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం సందర్భంగా స్వయంపాలన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గురువు మానవ జీవితంలో వెలుగు అని అన్నారు.ఉపాధ్యాయ వృత్తి సమాజంలో చాలా గౌరవప్రదమైనదని విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు.చాచా నెహ్రూ జీవిత విశేషాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు.ఒకరోజు ఉపాధ్యాయులు గా ఉన్న విద్యార్థులు తమ తమ అనుభవాలను పంచుకున్నారు అనం తరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్ర మంలో ఉపాధ్యాయులు పి.రాజశేఖర్,ఎ.పద్మ, చెరుకు మహేశ్వరశర్మ, ఎ.రజిత,పి.రమేశ్,ఎస్.శోభ ఎం.డి.రాజమహ్మద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








