
*ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు*
రాయికల్: నవంబర్ 19 (ప్రజావాణి)
రాయికల్ పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్ లో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 108వ జయంతి ఉత్సవాలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ….ఇందిరా గాంధీ నవంబర్ 19 1917లో జన్మించారని అన్నారు.ఇందిరాగాంధీ 1966లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రజలకు చేరువగా ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని, బ్యాంకుల జాతీయకరణ, పంటల ఉత్పత్తి పెంచటం కోసం హరిత విప్లవాన్ని అలాగే పేదరికం పారద్రోలడానికి గరీబ్ హటావో నినాదాన్ని తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువైందని అన్నారు.గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎన్నో గృహాలను నిర్మించి ఇవ్వడం జరిగిందని అన్నారు.అలాగే సాగునీటి కోసం కాలువలను తవ్వించి ప్రతి మారుమూల ప్రాంతానికి సాగునీరు అందించి పంటల ఉత్పత్తి పెరగడానికి దోహదపడి హరిత విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లారని, అలా ఉక్కు మహిళగా పేరు పొందిన భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 108వ జయంతి ఉత్సవాలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజరెడ్డి, పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, కొయ్యడి మహిపాల్ రెడ్డి, బాపురపు నర్సయ్య, మండ రమేష్,శేఖర్,ఏలేటి జలంధర్ రెడ్డి,నరేష్, రాజేందర్ రెడ్డి,రాజీవ్, నాగరాజు,షాకీర్,జగదీశ్వర్ రెడ్డి,శివ,జలపతి,సాగర్, రాకేష్ నాయక్, గుమ్మడి సంతోష్, రమేష్ నాయక్, మల్లేష్,నవీన్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.









