
*సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం*
*సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జూన్ 13 (మన ప్రజావాణి)*: చండూరు మండలం పరిధిలోని ధోనిపాముల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో భాగంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా చేరిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు జి సులోచన, గ్రామ విలేజ్ సెక్రటరీ అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు ఝాన్సీరాణి, అనిత, రజిత, అంగన్వాడి ఉపాధ్యాయులు తారక, నాగలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.