జగన్‌కు అదానీ ముడుపుల వ్యవహారం.. సంచలన విషయాలు చెప్పిన బాలినేని

Ramesh

Ramesh

District Chief Reporter

జగన్ కు అదానీ ముడుపుల వ్యవహారం ముదురుతోంది. సంచలనం రేపుతున్న సౌరవిద్యుత్‌ ఒప్పందానికి సంబంధించి నాటి ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasareddy) కీలక విషయాలను వెల్లడించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇంధనశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన.. తన ప్రమేయం లేకుండానే సెకితో ఒప్పందం జరిగిపోయిందన్నారు. అర్థరాత్రి 1 గంటకు లేపి తనను సంతకం చేయమని అడిగారని, అంత పెద్ద ఒప్పందం గురించి తనతో చర్చించకుండా సంతకం చేయమన్నారంటే.. ఏదో మతలబు ఉందనే తాను సంతకం చేయలేదన్నారు. ఒప్పందం వివరాలు పూర్తిగా తెలియకుండా సంతకం ఎలా చేస్తారని తన పీఎస్ అంతకుముందే అప్రమత్తం చేశాడని చెప్పారు. కాసేపటి తర్వాత ఇంధనశాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌.. తన అదనపు పీఎస్‌కు ఫోన్‌ చేసి సంతకం పెట్టకుంటే దస్త్రాన్ని కేబినెట్ సమావేశానికి పంపాలని చెప్పారని, ఆ తర్వాతి రోజు ఆ ఒప్పందాన్ని కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. సెకి ఒప్పందంపై అంత గూడుపుఠాణీ ఉందని తనకు తెలియలేదని వ్యాఖ్యానించారు.

శ్రీకాంత్ చెప్పినట్లే కేబినెట్ ముందుకు ఆ ఒప్పంద పత్రాలను తీసుకెళ్లానని, మంత్రిమండలిలో దానిని ఆమోదింప చేసుకున్నారని వివరించారు. ఒప్పందం పై ఎక్కడా తాను ఒక్క సంతకం కూడా చేయలేదన్న బాలినేని.. అంతా ఒక పెద్ద మంత్రి నడిపించారన్నారు. అడపాదడపా శ్రీకాంత్‌ వచ్చి సెకితో ఒప్పందం అని చర్చించేవారని పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదన్నారు. అలాంటి ఒప్పందం గురించి ప్రభుత్వ పెద్దలు తనకెందుకు చెబుతారని బాలినేని పెదవి విరిచారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

.మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

 నోటిఫికేషన్స్

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

 Share