300 బిలియన్ డాలర్లు అవసరాలను తీర్చలేవు.. పర్యావరణ ప్యాకేజీపై భారత్ అసంతృప్తి

Ramesh

Ramesh

District Chief Reporter

వాతావరణ ప్రతికూల మార్పులపై పోరాడేందుకు వర్ధమాన దేశాలకు 300 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందనుంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అజర్‌బైజాన్‌ రాజధాని బాకు వేదికగా ఐక్యరాజ్యసమితి కాప్‌-29 చర్చలు ఆదివారం కొనసాగాయి. వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు అందించాల్సిన ఆర్థిక సహాయం 300 బిలియన్‌ డాలర్లుగా నిర్ణయించారు. అయితే, ఈ ఒప్పందంపై భారత్‌ (India) అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతలను నెరవేర్చడానికి ఇష్టపడట్లేదు. అది నిరుత్సాహానికి గురిచేసింది. 300 బిలియన్‌ డాలర్లు అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలు, ప్రాధాన్యాలను పరిష్కరించవు. దీన్ని తీసుకునేందుకు వ్యతిరేకిస్తున్నాం. ఇది సీబీడీఆర్‌, ఈక్విటీ సుత్రానికి విరుద్ధంగా ఉంది’ అని భారత బృందం ప్రతినిధి చాందినీ రైనా (Chandni Raina) పేర్కొన్నారు.

ఆర్థిక సాయం ఒప్పందం ఆమోదానికి ముందు భారత ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చాందినీ రైనా పేర్కొన్నారు. మరోవైపు నైజీరియా (Nigeria) సైతం భారత్‌కు మద్దతు తెలిపింది. కాప్ -29 (COP29) సదస్సుల్లో ధనిక దేశాలు అందించే పర్యావరణ ప్యాకేజీ 300 బిలియన్‌ డాలర్లుగా నిర్ణయించారు. అయితే, దీనిపై వర్ధమాన దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ చర్చలు గత శుక్రవారంతో ముగియాల్సి ఉండగా.. ఈ ఒప్పందంపై 250 మంది అభ్యంతరం తెలపడంతో ఆదివారం సైతం చర్చలు కొనసాగాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

.మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

 నోటిఫికేషన్స్

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

 Share