
*ఒకరి నేత్రదానం నలుగురికి కంటి చూపు*
*నల్గొండ జిల్లా బ్యూరో/ చండూర్ మే 30 (మన ప్రజావాణి)*:
నేత్రదానం ద్వారా ద్వారా సేకరించిన కార్నియా అను కంటి పొరలను ఇద్దరి నుండి నలుగురికి అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చు అని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. పట్టణంలోని శాంతినగర్ ప్రాంతానికి చెందిన తౌడోజ్ వెంకటాచారి ప్రమాదశాతు బుధవారం మరణం పొందారు మృతుని భార్య పారిజాత కుమార్తెలు పావని తేజ రానిలను సంప్రదించగా మరణాంతరం నేత్రదానం గురించి అంగీకరించడంతో గురువారం టెక్నీషియన్ బచ్చలకూర జానీ నేత్రదాన సేకరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ కుటుంబమంతా తీవ్రమైన దుఃఖంలో ఉండి ఎంతో మానసిక శోభ అనుభవిస్తున్న సమయంలో కూడా తీవ్రమైన దుఃఖంలో ఉండి ఎంతో మానసిక శోభ అనుభవిస్తున్న సమయంలో కూడా నేత్రదానం చేయుట ఎంత గొప్ప విషయమని మరణానంతరం 6 నుండి 8 గంటల లోగా నేత్రదానం చేయించవలెనని ఒకవేళ పార్దివదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 15 గంటల వరకు నేత్రదానం చేయవచ్చునని సూచించారు ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాను కంటి పొరలను ఇద్దరు నుండి నలుగురికి అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కె వి ప్రసాద్, ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, ఏచూరి శైలజ, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్, నరాల రాము, లయన్ వేముల సాయి కుమార్, తదితరులు ఉన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025