
చందుర్తి లో మరో దారుణం....
••కన్నా తండ్రిని చంపినా కాసాయి కొడుకు...
•••వరుస హత్యాలతో ఉల్లిక్కి పడుతున్న జనం.
రాజన్న సిరిసిల్ల జిల్లా //మన ప్రజావాణి
కాల యముడిలా మారిన ఓ కాసాయి కొడుకు కన్నా తండ్రి ని పొట్టన పెట్టుకున్నాడు. చందుర్తి మండలం లో వరుస హత్యాలతో మరోసారి ఉలిక్కిపడిదనే చెప్పాలి.గత రోజుల క్రితం మండల కేంద్రం లో మల్లవ్వ అనే మహిళ హత్యకు గురైన ఘటన మరిచిపోకముందే మండలంలో మరో హత్య కలకాలం రేపుతుంది. మండలంలోని దేవుని తండాకు చెందిన గుగులోత్ తిరుపతి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.స్థానికుల వివరాల ప్రకారం......గత కొన్ని రోజుల నుండి కుటుంబ కలహాలతో చెలరేగుతున్న క్రమంలో జాటోత్ తిరుపతి కొడుకు రాజేష్ తన తండ్రినీ కారుతో బలంగా ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన తిరుపతిని స్థానికులు అంబులెన్స్ సాయంతో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఘటన కి సంబదించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇలాంటి వరుస హత్యలు జరగడం తో మండలం లో ప్రజలందరూ భయబ్రాంతులకు గురవుతున్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025