ఖమ్మంలో ఆంధ్రా భూ బకాసురుడి అరాచకం బకాసురుడు చేష్టలకు యంత్రాంగాలు అతలం కుతలం…? ఆంధ్ర నుండి తెలంగాణకు మారిన అడ్డా..? ప్రైవేటు సైన్యం పహారాలో జోరుగా సెటిల్మెంట్ లు…!

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఖమ్మంలో ఆంధ్రా భూ బకాసురుడి అరాచకం

బకాసురుడు చేష్టలకు యంత్రాంగాలు అతలం కుతలం…?

ఆంధ్ర నుండి తెలంగాణకు మారిన అడ్డా..?

ప్రైవేటు సైన్యం పహారాలో జోరుగా సెటిల్మెంట్ లు…!

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఏపీలో వెలగబెట్టింది చాలక తెలంగాణలోనూ విచ్చలవిడి అక్రమాలు , ఖమ్మంలో ఎన్నారై భూములపై కన్నేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ల పరంపర , అమ్మపాలెంలో అమ్ముడుపోయిన ఆర్బీఐ నిబంధనలు.. యధేశ్చగా కోర్టు ధిక్కరణ , ఏపీలో గత ప్రభుత్వ పెద్దల తాలూకా మనిషినంటూ బరితెగింపు , ఇప్పుడు ఖమ్మాన్ని తాకిన ఆంధ్రా రియల్ ఎస్టేట్ విష సంస్కృతి , తొలుత రిజిస్ట్రేషన్.. ఆనక 60-40 పర్సెంటేజీతో సెటిల్మెంట్ , ఖమ్మంలో కొత్త తరహా సెటిల్మెంట్లకు బొడ్డు కోసిన “కొత్తా దేవుదండీ”! ,నయీమ్ తరహా నయా దందాతో వణికిపోతున్న ఖమ్మం నడి బొడ్డు , ఆంధ్రా , తెలంగాణ రాష్ట్రాల నడుమ ఉన్న ఖమ్మం జిల్లా రెండు రాష్ట్రాల మిశ్రమ సంస్కృతికి పెట్టింది పేరు.. కమ్యూనిస్టులకు కంచుకోటగా చెప్పుకునే ఖమ్మం గడ్డ రాజకీయ చైతన్యానికి నిజంగా ఓ కొలమానమే.. అలాంటి ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగానికి అమితమైన ప్రాధాన్యం ఉంది.. అయితే భూ వ్యాపారం నేలను విడిచి ఆకాశాన్ని తాకిన రోజుల్లోనూ ఇక్కడ నిబంధనల ఉల్లంఘన తలెత్తింది లేదు.. కాగా ఓ ఆంధ్రా నయవంచకుడు ఖమ్మం రియల్ ఎస్టేట్ లో నయీమ్ మాదిరి ఆగడాలకు బరితెగిస్తున్నాడు.. మునుపెన్నడూ లేని చందంగా ఖమ్మంలో నయా విష సంస్కృతికి పురుడు పోశాడు.. ఇక్కడి ఎన్నారై భూములపై కన్నేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కోట్లల్లో సెటిల్మెంట్ కు తెర లేపాడు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కారు కొలువై ఉన్నప్పుడు నాటి ప్రభుత్వ పెద్దల పేర్లను ఎంచక్కా వాడుకున్న ఈ ప్రబుద్ధుడు అటు ఆంధ్రాలో ఇటు హైదరాబాద్ లో రియల్ దందా సాగించాడు. సీఎం పేషీలో ప్రముఖుల పేర్లు వల్లెవేస్తూ రియల్ ఎస్టేట్ పైరవీలు నడిపాడు. ఇప్పుడు దినదినాభివృద్ది చెందుతున్న ఖమ్మంపై అతగాడి దృష్టి పడింది.. “కోర్టు వివాదంలో ఉన్న భూములైనా.. ఎన్నారైలకు చెందిన భూమి అయినా.. పోరంబోకు భూములైనా.. ఇక మీ భూమిలో ప్రభుత్వ భూమి కలిసి ఉన్నా సరే.. అసలు పూర్తిగా సర్కారు స్థలమే అయినా సరే.. చివరికి అది అసైన్డ్ భూమి అయినా ఫర్వాలేదు.. నేను చెప్పిన పేరిట రిజిస్ట్రేషన్ చేయండి.. అంతే చాలు.. మిగతాది నేనే చూసుకుంటా” అంటూ ఖమ్మంలో విలువైన భూములపై గద్దలా తిరుగుతున్నాడు. ఇలా భూములను అన్యాక్రాంతం చేసే క్రమంలో ఎలాంటి పరిణామాలకైనా తనదే బాధ్యత అంటూ భరోసా ఇస్తున్నాడు. రిజిస్ట్రేషన్ తర్వాత 60-40 పర్సంటేజీతో సెటిల్మెంట్ చేయడాన్ని ఇతను ఆనవాయితీగా మార్చుకున్నాడు. “రెండు రాష్ట్రాల్లో పోలీస్ పవర్ నా చేతిలో ఉంది.. రెవెన్యూలో ఎలాంటి రికార్డు కదలాలన్నా నాకు చిటికెలో పని.. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వచ్చి నేను చెప్పిన పేరిట రిజిస్ట్రేషన్ చేస్తే అంతే చాలు.. భూమిపైకి వెళ్లేటప్పుడు ఎవరడ్డు వచ్చినా నేనే చూసుకుంటా.. పరిస్థితి చేయి దాటితే రౌడీలను రంగంలోకి దించుతా.. లోకల్ రౌడీలు సరిపోకపోతే హైదరాబాద్ నుంచి గుండాలను దించుతా..” క్లుప్తంగా ఇది ఆ భూ బకాసురుడి తీరు. భూముల అన్యాక్రాంతం కోసం ఎంతకైనా తెగించి, దేనికైనా బరితెగించడంలో అతను “ప్రవీణు”డు. ఖమ్మంలో నయా నయీమ్ తరహాలో రెచ్చిపోతున్న ఈ భూ బకాసురుడి వీర విహంగానికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. ఇతగాడి పోకడకు నివ్వెరపోవడం వ్యాపారులు , బాధితులవంతవుతోంది .

నిబంధనలు హుష్ కాకి.. ఓ ఎన్నారై భూమి రిజిస్ట్రేషన్..?

భారతదేశాన్ని విడిచి విదేశీ పౌరసత్వం పొందిన ఎన్నారైలు ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేసే విషయంలో చట్ట ప్రకారం కొన్ని నిబంధనలున్నాయి. అవేంటంటే.. ఎన్నారైగా ఉన్న వ్యక్తి భారతదేశంలో ఫార్మ్ హౌస్ గానీ, వ్యవసాయ భూమి కానీ, ప్లాంటేషన్ భూమి కానీ కొనుగోలు చేయకూడదు. ఇలా ఒక వేళ కొనుగోలు చేయాలంటే ఆర్బీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ లేకుండా కొనుగోలు చేస్తే భూమి విలువకు మూడు రెట్ల జరిమానాను భారత ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలా ఎన్నారైలు కొనుగోలు చేసిన భూమిని మరొకరికి విక్రయించడం కూడా చట్ట ప్రకారం నిషిద్ధమే అవుతుంది. అలాంటి భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేసే “ప్రావీణ్యం” మన సిద్ధహస్తుడికే చెల్లుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రానికి చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములు ధర పరంగా రెక్కలు తొడుక్కున్నాయి. దీంతో రియల్ భూ బకాసురులు భూముల అన్యాక్రాంతానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఖమ్మం నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపాలెంలో ఈ ఆంధ్రా కబ్జాకోరు ఒక ఎన్నారైకి చెందిన ఎనిమిదెకరాల భూమిపై కన్నేశాడు. ఈ భూమి కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ ఒక బినామీ పేరిట జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈక్రమంలో ఆర్బీఐ నిబంధనలతో పాటు కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడ్డాడు. ఒకవేళ వివాదం చోటుచేసుకుంటే రౌడీయిజాన్ని ప్రదర్శించడం, గుండాగిరీకి దిగడం కోసం మందీ మార్బలాన్ని సిద్ధం చేసుకున్నాడు. అలాగే ఈ భూమికి పక్కనే ఉన్న మరో వివాదాస్పద భూమిలో సైతం రూ.3 కోట్లను బయానా రూపంలో పుచ్చుకోవడం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఇలా వివాదాల్లో ఉన్న భూములను తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ తర్వాత ఆ వివాదాన్ని మరింత పెంచి పెద్ద చేయడాన్ని ఇతగాడు తన నైజంగా మార్చుకున్నాడు. ఈక్రమంలో పోలీసింగ్, రెవెన్యూతో పాటు ఇతర ప్రభుత్వ యంత్రాంగాలను సైతం యధేశ్చగా వాడుకుంటూ, అవసరమైతే రౌడీలను రంగంలోకి దించి ప్రత్యర్ధులను,బాధితులను బెంబేలెత్తిస్తున్నాడు.

ముగ్గురు మంత్రులున్న జిల్లాలో కొనసాగుతున్న అక్రమ దందాలు..?

రాష్ట్రంలో ఏ జిల్లాకు పట్టని అదృష్టం ఖమ్మం జిల్లాకే పట్టింది. ఎందుకంటే ఇక్కడి నుంచి రాష్ట్ర కేబినెట్ లో ముగ్గురు మంత్రులు కొలువై ఉన్నారు. ఇందులో ఒకరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాగా మరొకరు ఎంతో కీలకమైన రెవెన్యూశాఖ మంత్రి కావడం విశేషం. ఇలాంటి ఖమ్మం జిల్లాలో ఆంధ్రా నుంచి వచ్చిన ఒక భూ బకాసురుడు హల్చల్ చేయడమే విడ్డూరం. కమ్యూనిస్టుల ప్రాబల్యం కలిగి అత్యంత చైతన్యం కలిగిన మేధావులున్న ఈ జిల్లాలో ఓ వ్యక్తి ఇక్కడి భూములపై రాబంధులా మారి పెత్తనం చేయడం విస్మయం కలిగిస్తోంది. అలాగే సీఎం పేషీలో ప్రముఖుల పేర్లు చెబుతూ ప్రభుత్వ యంత్రాగాలను సైతం ప్రభావితం చేస్తున్న తీరు విస్తుగొలుపుతోందని తెలంగాణ ప్రజా చైతన్య వేదిక తరపున ఖండించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

*మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరీ చేయిచుకుంటున్న ఏనిమిది మంది నిందితుల ను అరెస్టు చేసిన జిల్లా పోలీస్* *మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరి చేయిస్తే కఠిన చర్యలు తప్పవు.* *… జిల్లా యస్.పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 22 (మన ప్రజావాణి)*: గత కొంత కాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో కొందరు చేపల వ్యాపారం చేసే వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి అనగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా రాష్ట్రాల నుండి వ్యక్తులను రవాణా చేసుకొని వారితో వెట్టి చాకిరి చేయించుకుని ఎలాంటి జీతాలు ఇవ్వకుండా వాళ్లను భయానికి గురి చేస్తూ పని సమయ వేళలు పాటించకుండా ఆధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారితో చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరి చేపించుకుంటున్న వ్యక్తుల చెర నుండి , దేవరకొండ సబ్ డివిజన్ పరిధి లో 32 కార్మికులు, 4 గురు బాలకార్మికులు, మొత్తం 36 మంది వెట్టిచాకిరి బాధితులను జిల్లా పోలీసు, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులు సమన్వయం తో బృందాలుగా ఏర్పడి నది పరిపాక ప్రాంతంలోని వ్యక్తులను గుర్తించి రెస్క్యూ చేసి వెట్టి చాకిరి చేయించుకుంటున్న నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది. *నిందితుల వివరాలు* . వడ్త్య జవాహర్ లాల్ తండ్రి రాములు, వయస్సు: 50 సం.లు, నివాసం : బనాలకుంట గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. రామవత్ రమేష్ తండ్రి లక్పతి , వయస్సు: 24 సం.లు,నివాసం : పాయ తండా గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. మైలపల్లి శివ తండ్రి దేవుడు, వయస్సు: 30 సం.లు, నివాసం : ఇంటి నెంబర్. 4-45 వాడపాలెం గ్రామం, రాంబిల్లి మండల్, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. కారే సింహా చలం తండ్రి: సింహా చలం, వయస్సు: 39 సం.లు, నివాసం : బంగారమ్మపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. వంక విశాఖ @ ఇషాక్ తండ్రి: మహంకాల్, వయస్సు: 26 సం.లు, నివాసం : అమలాపురం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. ఎరిపల్లి బాబుజీ @ బావొజి తండ్రి: బంగారి, వయస్సు: 45 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. చాపల తాత రావు తండ్రి: సోమరాజు, వయస్సు: 38 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా, తెలంగాణ. చాపల బంగారి తండ్రి: బంగారి వయస్సు: 39 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. *నమోదైన కేసుల వివరాలు* : క్రైమ్. నెంబర్.66/2025 యు/ఎస్ 143(4), 146 బి ఎన్ ఎస్ సెక్షన్. 79 ఆఫ్ జె జె యాక్ట్ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ , క్రైమ్ నెంబర్. 68/2025 యు/ఎస్ 146 బి ఎన్ ఎస్ సెక్షన్.18 ఆఫ్ బిఎల్ఎస్ఎ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్. 69/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ పి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్.117/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.18 బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ గుడిపల్లి, క్రైమ్. నెంబర్.118/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 ఆఫ్ జె జె యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పి ఎస్ గుడిపల్లి *కేసు వివరాలు* పైన తెలిపిన నిందితుల లో గుడిపల్లి కి చెందిన జబ్బార్ @ జవహర్ లాల్, రమేశ్, శివ లు వీరి ఏజెంట్లు అయిన రాజు,(హైద్రాబాద్) జగన్, (హైద్రాబాద్) లోకేశ్ (విజయవాడ)లకు ఒక వ్యక్తి కి 1500 చొప్పున కమిషన్ ఇచ్చి హైద్రాబాద్ విజయవాడ నుంచి వలస కార్మికులను నెలకు 15 వేల జీతం, రోజుకి 2 గంటల పని, ఉచిత ఆహారం మరియు మద్యం సరఫరా చేస్తాం అని మబ్య పెట్టి వారిని అక్కడ నుంచి దేవరకొండ లోని మల్లేపల్లి వరకు పంపుతారు. అక్కడ నుంచి నిందితులు వారి సెల్ ఫోన్ తమ అదినంలో పెట్టుకొని వారిని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల పైన నేరేడు గుమ్ము పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణాలకుంట,వైజాగ్ కాలనీ కి తరలించి వారితో అక్కడ తెల్లవారు జామునా నదిలోకి చేపలు పట్టుటకు పంపేవారు. అలాగే చేపల వలలు లాగుటకు ఉపయోగించుకునేవారు. వీరికి రోజుకు రెండు పూటలా మాత్రమే ఆహారం అందిచేవారు. వీరికి పని బారం ఎక్కువ అయితుంది. మేము చేసిన పనికి డబ్బులు ఇవ్వవలసిందిగా కోరగా డబ్బులు ఇవ్వకుండా వీరిని హింసిస్తూ వాతలు పెట్టేవారు. ఇదే విదంగా నిందితులు అయిన ఇషాక్ మరియు సింహాచలం వారి ఏజెంట్ అయిన వెంకన్న (విజయవాడ) (5000 ఒక్కరికీ కమిషన్) కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు. పైన తెలిపిన ఏజెంట్లు అయిన రాజు, జగన్, లోకేశ్, వెంకన్నలు కొరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో అదుపులోకి తీసుకొనీ పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తులను అక్రమ రవాణా చేసి వారిని బెదిరించి లేదా గాయపరిచి వారితో ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా సమయవేళలు పాటించకుండా పనులు చేయించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా బాల బాలికలను పనిలో పెట్టుకున్న చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకున్న చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలి అని ఎస్పీ కోరినారు. ఈ ఆపరేషన్ ను దేవరకొండ ఎ ఎస్పి మౌనిక పర్యవేక్షణలో డిండి, కొండమల్లేపల్లి సిఐ లు, గుడిపల్లి, నేరేడు గుమ్ము , గుర్రంపోడ్ ఎస్సై రెవెన్యూ, చైల్డ్ కేర్, చైల్డ్ లైన్ , సి డబ్ల్యూ సి బృందం, నేరేడుగొమ్ము పోలీసు స్టేషన్ సిబ్బంది పి.మహేశ్, ఆర్.రాజు, వి.‌పి.‌ఓ ప్రశాంత్, వై.నరేందర్ రెడ్డి తదితరులు జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.

 నోటిఫికేషన్స్

 Share