అభివృద్దిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు.. వార్డుకు ఒక ఆఫీసర్

Ramesh

Ramesh

District Chief Reporter

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, అర్హులకు ప్రభుత్వ పథకాలు వేగంగా చేరేలా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వార్డుకు ఒక ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నది. దీనికి గాను 1,829 మంది గ్రూప్-4 ఉద్యోగులను వార్డు ఆఫీసర్లుగా కేటాయించింది. వీరిలో హైదరాబాద్ రీజియన్‌కు 958 మంది, వరంగల్ రీజియన్‌కు 871 మంది అలాట్ చేసింది.

 

రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో 3,488 వార్డులున్నాయి. ఇందులో 50 వేల జనాభా కంటే తక్కువగా ఉంటే రెండు వార్డులకు కలిపి ఒక వార్డు ఆఫీసర్, 50 వేలకుపైగా జనాభా ఉంటే ఒక వార్డు ఆఫీసర్‌ను నియమించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫీర్జాదిగుడ, జవహర్‌నగర్, నిజాంపేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బడంగ్‌పేట పరిధిలోని ఒక్కో వార్డుకు ఒక్కో ఆఫీసర్‌ను నియమించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక ఆఫీసర్‌ను కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

పురపాలక శాఖకు కేటాయించిన 2,217 మంది గ్రూప్-4 ఉద్యోగులకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం రెండు రోజులుగా సాగుతున్నది. వీరిలో ఇప్పటి వరకు 1,928 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 289 మంది ఉద్యోగులకు ఫోన్ చేసి మాట్లాడినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 1023 మంది హాజరయ్యారు. వీరిలో వార్డు ఆఫీసర్లు 821, జూనియర్ అసిస్టెంట్లు 91, జూనియర్ అకౌంటెంట్లు 111 మంది ఉన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో 905 మంది హాజరైతే వారిలో వార్డు ఆఫీసర్లు 748 మంది, జూనియర్ అసిస్టెంట్లు 66, జూనియర్ అకౌంటెంట్లు 91 మంది ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share