*టార్గెట్ PoK – స్వాధీనానికి యుద్ధం !*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*టార్గెట్ PoK – స్వాధీనానికి యుద్ధం !*

కశ్మీర్‌లో కొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్ చెరలో ఉంది. దాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అని పిలుస్తున్నారు. అసలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులన్నీ అక్కడే ఉంటాయి. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇటీవల పీవోకేలో పర్యటించారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. పెహల్గాంలో జరిగిన దాడిలో హమాస్ పాత్ర ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. భారత్ పై ఉగ్రవాద యుద్ధానికి పీవోకే ఎలా కీలకంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంటే తప్ప..ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యం కాదు.

*పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచే ఉగ్రవాదం*

కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందేనని రక్షణ నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. గతంలో పీవోకేలోని ఆర్మీ క్యాంపులపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసింది. అయినా ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. అందుకే.. పీవోకేను తిరిగి పొందాలన్న కృతనిశ్చయంతో.. కేంద్ర ప్రభుత్వం ఉంది. బీజేపీ నేతలు కూడా.. మోడీ, షా నిర్ణయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దౌత్య పరంగా.. చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే.. ఇతర మార్గాలను రెడీ చేసుకోవాలంటున్నారు.

*క్రిమియాను రష్యాకు అప్పగించేలా చేస్తున్నట్లే పీవోకేనూ తీసుకోవాలి !*

ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేసింది. తమ దేశంపై కుట్రలు చేయడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది . క్రిమియా అనే ప్రాంతాన్ని ఇచ్చేయాలని ట్రంప్ కూడా ఉక్రెయిన్ పై ఒత్తిడి. తెస్తున్నారు. పీవోకే విషయంలోనూ ఇలాంటి ప్రయత్నమే భారత్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో పీఓకేను వెనక్కి తీసేసుకోవాలని, అందులో మూడో దేశ జోక్యానికి అవకాశం ఇవ్వకూడదని ఒక తీర్మానం ఆమోదించారు. పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడిచేస్తే.. ట్రంప్ కూడా భారత్ కు మద్దతుగా ఉండే అవకాశం ఉంది.

*పీవోకే కోసం ప్రాణాలిస్తామని గతంలో అమిత్ షా ప్రకటన*

చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ రెండూ భారత్ లో భాగమే. వాటిని తిరిగి తెచ్చుకునేందుకు అమిత్ షా ఆర్టికల్ 370 రద్దు సమయంలో పార్లమెంట్లో ప్రకటించారు. పీఓకేను పాకిస్తాన్ అంత తేలిగ్గా వదులుకోదు. పీవోకేను.. సర్వనాశనం చేయడానికైనా అంగీకరిస్తుంది కానీ.. అప్పగించదు. సేనలు నేరుగా ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లిపోవడం మినహా వేరు గత్యంతరం కూడా లేదు. ఇప్పటికే రెండు సర్జికల్ దాడులతో సైన్యం సత్తా చూపించింది. అయితే పీఓకేను కలుపుకోవాలంటే చిన్న దాడులు సరిపోవు.. పెద్ద యుద్దమే చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం నిపుణుల నుంచి వస్తోంది. భారతదేశమే మొదట దాడి చేసిందన్న అపవాదు రాకుండా ఇప్పుడు పెహల్గాం దాడి ఘటన ఉపయోగపడుతుంది.

*పాకిస్తాన్ ఆయువు మీద దెబ్బకొట్టాలి !*

పీవోకే విషయంలో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేయండ భారత్‌కు ముఖ్యం. అయితే.. మోడీ , షాల నేతృత్వంలో అది పెద్ద విషయం కాదు. పీవోకేను.. భారత్‌లో చేర్చితే.. ప్రధాని మోడీ, అమిత్ షాలు చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే.. దేశ విభజన నాటి నుంచి.. సరిహద్దుల్ని ఉద్రిక్తతంగా ఉంచుతూ.. వస్తున్న.. సీమాంతర ఉగ్రవాదం… అంతమైపోతుంది. విశాల భారత్ ఏర్పడుతుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

*మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరీ చేయిచుకుంటున్న ఏనిమిది మంది నిందితుల ను అరెస్టు చేసిన జిల్లా పోలీస్* *మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరి చేయిస్తే కఠిన చర్యలు తప్పవు.* *… జిల్లా యస్.పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 22 (మన ప్రజావాణి)*: గత కొంత కాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో కొందరు చేపల వ్యాపారం చేసే వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి అనగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా రాష్ట్రాల నుండి వ్యక్తులను రవాణా చేసుకొని వారితో వెట్టి చాకిరి చేయించుకుని ఎలాంటి జీతాలు ఇవ్వకుండా వాళ్లను భయానికి గురి చేస్తూ పని సమయ వేళలు పాటించకుండా ఆధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారితో చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరి చేపించుకుంటున్న వ్యక్తుల చెర నుండి , దేవరకొండ సబ్ డివిజన్ పరిధి లో 32 కార్మికులు, 4 గురు బాలకార్మికులు, మొత్తం 36 మంది వెట్టిచాకిరి బాధితులను జిల్లా పోలీసు, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులు సమన్వయం తో బృందాలుగా ఏర్పడి నది పరిపాక ప్రాంతంలోని వ్యక్తులను గుర్తించి రెస్క్యూ చేసి వెట్టి చాకిరి చేయించుకుంటున్న నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది. *నిందితుల వివరాలు* . వడ్త్య జవాహర్ లాల్ తండ్రి రాములు, వయస్సు: 50 సం.లు, నివాసం : బనాలకుంట గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. రామవత్ రమేష్ తండ్రి లక్పతి , వయస్సు: 24 సం.లు,నివాసం : పాయ తండా గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. మైలపల్లి శివ తండ్రి దేవుడు, వయస్సు: 30 సం.లు, నివాసం : ఇంటి నెంబర్. 4-45 వాడపాలెం గ్రామం, రాంబిల్లి మండల్, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. కారే సింహా చలం తండ్రి: సింహా చలం, వయస్సు: 39 సం.లు, నివాసం : బంగారమ్మపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. వంక విశాఖ @ ఇషాక్ తండ్రి: మహంకాల్, వయస్సు: 26 సం.లు, నివాసం : అమలాపురం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. ఎరిపల్లి బాబుజీ @ బావొజి తండ్రి: బంగారి, వయస్సు: 45 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. చాపల తాత రావు తండ్రి: సోమరాజు, వయస్సు: 38 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా, తెలంగాణ. చాపల బంగారి తండ్రి: బంగారి వయస్సు: 39 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. *నమోదైన కేసుల వివరాలు* : క్రైమ్. నెంబర్.66/2025 యు/ఎస్ 143(4), 146 బి ఎన్ ఎస్ సెక్షన్. 79 ఆఫ్ జె జె యాక్ట్ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ , క్రైమ్ నెంబర్. 68/2025 యు/ఎస్ 146 బి ఎన్ ఎస్ సెక్షన్.18 ఆఫ్ బిఎల్ఎస్ఎ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్. 69/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ పి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్.117/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.18 బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ గుడిపల్లి, క్రైమ్. నెంబర్.118/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 ఆఫ్ జె జె యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పి ఎస్ గుడిపల్లి *కేసు వివరాలు* పైన తెలిపిన నిందితుల లో గుడిపల్లి కి చెందిన జబ్బార్ @ జవహర్ లాల్, రమేశ్, శివ లు వీరి ఏజెంట్లు అయిన రాజు,(హైద్రాబాద్) జగన్, (హైద్రాబాద్) లోకేశ్ (విజయవాడ)లకు ఒక వ్యక్తి కి 1500 చొప్పున కమిషన్ ఇచ్చి హైద్రాబాద్ విజయవాడ నుంచి వలస కార్మికులను నెలకు 15 వేల జీతం, రోజుకి 2 గంటల పని, ఉచిత ఆహారం మరియు మద్యం సరఫరా చేస్తాం అని మబ్య పెట్టి వారిని అక్కడ నుంచి దేవరకొండ లోని మల్లేపల్లి వరకు పంపుతారు. అక్కడ నుంచి నిందితులు వారి సెల్ ఫోన్ తమ అదినంలో పెట్టుకొని వారిని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల పైన నేరేడు గుమ్ము పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణాలకుంట,వైజాగ్ కాలనీ కి తరలించి వారితో అక్కడ తెల్లవారు జామునా నదిలోకి చేపలు పట్టుటకు పంపేవారు. అలాగే చేపల వలలు లాగుటకు ఉపయోగించుకునేవారు. వీరికి రోజుకు రెండు పూటలా మాత్రమే ఆహారం అందిచేవారు. వీరికి పని బారం ఎక్కువ అయితుంది. మేము చేసిన పనికి డబ్బులు ఇవ్వవలసిందిగా కోరగా డబ్బులు ఇవ్వకుండా వీరిని హింసిస్తూ వాతలు పెట్టేవారు. ఇదే విదంగా నిందితులు అయిన ఇషాక్ మరియు సింహాచలం వారి ఏజెంట్ అయిన వెంకన్న (విజయవాడ) (5000 ఒక్కరికీ కమిషన్) కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు. పైన తెలిపిన ఏజెంట్లు అయిన రాజు, జగన్, లోకేశ్, వెంకన్నలు కొరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో అదుపులోకి తీసుకొనీ పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తులను అక్రమ రవాణా చేసి వారిని బెదిరించి లేదా గాయపరిచి వారితో ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా సమయవేళలు పాటించకుండా పనులు చేయించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా బాల బాలికలను పనిలో పెట్టుకున్న చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకున్న చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలి అని ఎస్పీ కోరినారు. ఈ ఆపరేషన్ ను దేవరకొండ ఎ ఎస్పి మౌనిక పర్యవేక్షణలో డిండి, కొండమల్లేపల్లి సిఐ లు, గుడిపల్లి, నేరేడు గుమ్ము , గుర్రంపోడ్ ఎస్సై రెవెన్యూ, చైల్డ్ కేర్, చైల్డ్ లైన్ , సి డబ్ల్యూ సి బృందం, నేరేడుగొమ్ము పోలీసు స్టేషన్ సిబ్బంది పి.మహేశ్, ఆర్.రాజు, వి.‌పి.‌ఓ ప్రశాంత్, వై.నరేందర్ రెడ్డి తదితరులు జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.

 నోటిఫికేషన్స్

 Share