*గుండెపోటుతో చెన్నారం సొసైటీ కార్యదర్శి మృతి

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*గుండెపోటుతో చెన్నారం సొసైటీ కార్యదర్శి మృతి*

* *ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా వైరాలో హఠాన్మరణం*

కుటుంబ సభ్యుల్లో నెలకొన్న విషాదం

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం నుంచి భద్రాచలం డిపో బస్సులో కూనవరం వెళ్తూ మార్గమధ్యలోని వైరాలో ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలంలోని చెన్నారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యదర్శి ఎస్వీ సత్యనారాయణ (64) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సత్యనారాయణ నేలకొండపల్లి మండలంలో అమ్మగూడెం లో భార్య పిల్లలతో నివాసముంటున్నారు. సోమవారం ఖమ్మం వచ్చి కూనవరం వెళ్లేందుకు భద్రాచలం వెళ్తున్న డీలక్స్ బస్సు ఎక్కారు. ఖమ్మం నుంచి భద్రాచలానికి టిక్కెట్ తీసుకున్నారు. వైరా బస్టాండ్ కు వచ్చిన తర్వాత పక్కనున్న తోటి ప్రయాణికుడితో పంటి నొప్పిగా ఉందని చెప్పి కొన్ని మంచినీళ్లు తాగారు. బస్టాండ్ నుంచి బస్సు జాతీయ ప్రధాన రహదారిలోని పోలీస్టేషన్ సమీపానికి వచ్చే సమయానికి శ్వాస ఆడక సత్యనారాయణ తీవ్ర ఇబ్బందిపడ్డాడు. ఆవెంటనే 108 వాహనంలో చికిత్స కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతిచెందాడు. సత్యనారాయణకు ఇంకా కేవలం ఏడాది మాత్రమే కార్యదర్శిగా సర్వీస్ ఉంది. ఏపీలోని కూనవరం ఆయన స్వస్థలం. అక్కడకు వెళ్తూ గుండెపోటుతో మార్గమధ్యలోని వైరాలో హఠాన్మరణం చెందారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆర్టీసీ బస్సు కండక్టర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వైరా పోలీసులు దర్శాప్త చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share