తీవ్ర విషాదం.. బి.టెక్ విద్యార్థిని బలవన్మరణం

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

తీవ్ర విషాదం.. బి.టెక్ విద్యార్థిని బలవన్మరణం..
సూర్యాపేట జిల్లా కోదాడ /ఏప్రిల్ 19:మన ప్రజావాణి
బీటెక్ విద్యార్థిని మనస్తాపంతో
బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సూర్యాపేట
జిల్లా చిలుకూరులో ఇవాళ తెల్లవారుజామున
చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా
జైపూర్ మండల పరిధిలోని
పగడపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి
చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్
కళాశాల లో
చదువుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున
కృష్ణవేణి కళాశాల భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి దూకి
ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఉగాది కి
ఇంటికి వెళ్లి కృష్ణవేణి శుక్రవారం సాయంత్రం
కళాశాలకు వచ్చింది. తల్లితో కలిసి రాత్రి హాస్టల్లో నే
గడిపింది. అనంతరం తెల్లవారుజామున తల్లి రూంలో
ఉండగానే కళశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకి
ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల యాజమాన్యం
సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు ఘటనకు
సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share