అనంతగిరిలో గంజాయి ముఠా అరెస్ట్* *గంజాయిని సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్న వైనం* *నలుగురు నిందితులు అరెస్టు, పరారీలో ఇద్దరు నిందితులు* *కోదాడ రూరల్ సీ.ఐ కె ప్రతాప్ లింగం*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*అనంతగిరిలో గంజాయి ముఠా అరెస్ట్*

*గంజాయిని సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్న వైనం*

*నలుగురు నిందితులు అరెస్టు, పరారీలో ఇద్దరు నిందితులు*

*కోదాడ రూరల్ సీ.ఐ కె ప్రతాప్ లింగం*

అనంతగిరి ఆగస్టు 28 ( మన ప్రజావాణి ):

అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగలాయికోట గ్రామ శివారులో కృష్ణాపురం గ్రామానికి వెళ్ళు దారిలో గల పెరుమాల బండ వద్ద నిషేధిత గంజాయిని విక్రయిస్తూ, సేవిస్తుండగా గురువారం ఉదయం 9:30 సమయంలో అనంతగిరి పోలీసులు అరెస్టు చేశారు అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నేరస్తులు ఆరుగురు స్నేహితులు మరియు ఒకరికొకరు పరిచయస్తులు వీరు గంజాయి తాగడానికి అలవాటు అయ్యి గత కొన్ని రోజుల నుండి అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయిని త్రాగడంతో పాటు విక్రయించడానికి కూడా అలవాటు అయినారు ఇట్టి క్రమంలోనే ఆగస్టు 28వ తేదీన గురువారం ఉదయం సమయంలో నేరస్తుడైన మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఓర్సు సాయిచరణ్, కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన షేక్ అలీమ్ (ఎలియాస్ సన్నీ తండ్రి మదర్ సాహెబ్) మరియు మాలోతు సాయికుమార్ (ఏలియా సాయి తండ్రి లక్ష్మా)లను కలిసి చేరి 100 గ్రాముల గంజాయిని ఇచ్చి తన మోటార్ సైకిల్ పై వెళ్లి మొగలాయికోట గ్రామానికి వెళ్లి, ఆ గ్రామ శివారులో గల కిష్టాపురం గ్రామానికి వెళ్ళుదారిలో పెరుమాల బండ వద్ద చెందిన సోమసాయి (ఎలియాస్ సాయికృష్ణ తండ్రి సత్యనారాయణ) మరియు కాపుగల్లు గ్రామానికి చెందిన మక్కా భాస్కర్ తండ్రి వెంకటయ్యలను అమ్మి వారి వద్ద నుండి తలా వెయ్యి రూపాయలు తీసుకొని రమ్మని చెప్పగా అతని ఆదేశాల మేరకు వీరిద్దరూ మోటార్ సైకిల్ పై మొగలాయికోట గ్రామ శివారులో గల పేరుమల బండ వద్దకు వెళ్లి సోమసాయి( ఏలియాస్ సాయి కృష్ణ) మరియు మక్కా భాస్కర్లకు గంజాయిని అమ్మడానికి ప్రయత్నిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు అనంతగిరి పోలీసు వారు మాటువేసి పట్టుబడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 200 గ్రాములు గంజాయిని,మోటార్ సైకిల్ ను, రెండు సెల్ ఫోన్ లను,2000 రూపాయలు లను మరియు గంజాయిని త్రాగడానికి ఉపయోగించే రెండు పేపర్ కవర్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఇట్టి గంజాయి విలువ సుమారు 5000 రూపాయల వరకు ఉంటుందని పైన తెలిపిన నేరస్థులను కోర్టు నందు హాజరు పరచడం జరుగుతుందని కోదాడ రూరల్ సి ఐ కే ప్రతాప్ లింగం తెలిపారు అందులో ఇద్దరు నిందితులు పరారీ లో ఉన్నట్లు తెలిపారు వారి వివరాలు ఓర్సు సాయిచరణ్ మేళ్లచెర్వు, సోమహర్షవర్ధన్ అనంతగిరి వీరిద్దరూ పరారీలో ఉన్నారని తెలిపారు ఇట్టి స్పెషల్ టాస్క్ లో కోదాడ రూరల్ సీఐ కే ప్రతాప్ లింగం, అనంతగిరి ఎస్సై ఎం నవీన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది అయిన రమేష్, నిరంజన్,ఏడుకొండలు మరియు సక్రు లు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share