*కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల తో ముఖాముఖి నిర్వహించిన రాష్ట్ర గవర్నర్

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల తో ముఖాముఖి నిర్వహించిన రాష్ట్ర గవర్నర్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15 (మన ప్రజావాణి)*:

నల్గొండ జిల్లాను టీబి రహిత, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం అయన మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం నాల్గవ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం, నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదీత్య భవన్లో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముందుగా రాష్ట్ర గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ…… నల్గొండ జిల్లాలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, జిల్లాలో వైటిపిఎస్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య, విద్య, జల్ జీవన్, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ పథకం, సమగ్ర శిక్ష అభియాన్, భవిత కేంద్రాలు గ్రామ సడక్ యోజన, టి బి ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, గృహ నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, ఆబ జన జాతీయ యోజన, ఆది కర్మయోగి అభియాన్, తదితర పథకాల పై లెక్కలతో సహా వివరించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లాలో శాంతి భద్రతల పై వివరాలను తెలియజేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు లయన్ డిస్టిక్ గవర్నర్ మదన్ మోహన్, ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, వైద్యులు జయప్రకాశ్ రెడ్డి, సామాజిక కార్యకర్త సురేష్ గుప్తా, కవి సగర్ల సత్తయ్య, దుశ్చర్ల సత్యనారాయణ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణ కాంత్ నాయక్, రైతు రాంరెడ్డి,పదవతరగతి జిల్లా టాపర్ విద్యార్థిని అమూల్య, హెచ్ఐవి పై పనిచేస్తున్న సంఘసంస్కర్త మేరీ తదితరులు వారు చేస్తున్న రంగాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గవర్నర్ కు వివరించారు. జిల్లా అధికారులతో ముఖాముఖి సందర్భంగా జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాసులు జిల్లాలో టీబీ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, చికిత్స, తదితర అంశాలను వివరించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ క్షయ వ్యాధిని జిల్లాలో సమూలంగా నిర్మూలించేందుకు ఉన్న అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో టీబీ పట్ల అవగాహన కల్పించాలని, క్షయ వ్యాధి నివారణకు సొసైటీలో అందరినీ భాగస్వామ్యం చేయాలని అన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కవులు, కళాకారులు , రచయితలు వివిధ రంగాలలోని ప్రముఖులను టీబి ముక్త్ భారత్ లో భాగస్వాములను చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి టీబి ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డికి సూచించారు. టి బి నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీబి ముక్త్ భారత్ కార్యక్రమానికి భారత ప్రధాని సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం పై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, గ్రామాలలో సర్పంచ్ లను చురుకుగా పాల్గొనే విధంగా చూడాలని, కవులు, కళాకారులు, రచయితల ద్వారా సాంఘిక నాటకాలు, నాటికలు, పద్యాలు, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని, టీబి కి వ్యతిరేకంగా అందర్నీ భాగస్వాములు చేయాలని సూచించారు. అలాగే నల్గొండ జిల్లాలో గాంజా ఎక్కువ మొత్తంలో ఉందని తెలుసుకొని గాంజా నిర్మూలనలో సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ రెండు అంశాలపై తో పాటు, మహిళా సాధికారతకు కృషి చేయాలని, ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు. కళాకారులు, కవులు, పర్యావరణవేత్తలు సైతం టీబీ ముక్తు భారత్ లో పనిచేయాలని కోరారు. విశ్వవిద్యాలయ వీసీలు మొదలుకొని కింది స్థాయి వరకు అందరూ భాగస్వాములు అయితే టీబి, మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించవచ్చని, అప్పుడు నల్గొండ జిల్లాను టీబి, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్ద వచ్చని అన్నారు. ముఖ్యమైన పథకాల అమలులో గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకించి మారుమూల గిరిజన ప్రాంతాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్షేత్రస్థాయిలో చివరి మనిషి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ రంగాలలో పని చేస్తున్న ప్రముఖులు వారు సొసైటీకి ఏం చేయగలమో ఆలోచించాలని, ఈ విషయంపై ఎంపీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని పునరుద్గాటించారు. నల్గొండ జిల్లాలో వైద్యం, ఆరోగ్యం, విద్య పథకాల అమలు పట్ల ఆయన జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు. అలాగే పోషణ అభియాన్ తో పాటు, ఇతర పథకాలు బాగా అమలు చేస్తుండడం పట్ల కితాబునిచ్చారు. పౌష్టికాహారం టి బి నివారణ, మాదకద్రవ్య నివారణ, తదితర పథకాలలో సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంపీ రఘువీర్రెడ్డిలు రాష్ట్ర గవర్నర్ ను శాలువా, మేమేంటోతో సత్కరించారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు నల్గొండ జిల్లాలో టీబి నివారణకు ముఖ్యుల సలహాలు తీసుకోవడమే కాకుండా, జిల్లా యంత్రాంగంతో కలిసి పని చేస్తామని అన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ఆసియాలోనే అతి పెద్ద రైస్ మిల్లు ఇండస్ట్రీ ఉందని, దీనివల్ల వాతావరణ కాలుష్యం ,టీబి వంటి వ్యాధులు సోకడానికి ఆస్కారం ఉందని ,ఆ ప్రాంతంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి టీబి నివారణకు కృషి చేస్తామన్నారు. అలాగే పట్టణాలలో గాంజా వాడకం ఎక్కువగా ఉందని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, డిఎఫ్ఓ రాజశేఖర్ ,రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు , తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share