
*కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం*
•••ఆరుగురికి తీవ్ర గాయాలు
••మూడేళ్ల చిన్నారి మృతి
•••పెళ్ళి వరి ఇంట్లో విషాద ఛాయలు.
జగిత్యాల//మన ప్రజావాణి
కొండగట్టు వద్ద గురువారం తెల్లవారి జామున పెళ్లి బృందం కారుకు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందడంతో పెళ్లి నిలిచిపోయిన విషాద సంఘటన మల్యాల మండలం కొండగట్టు వద్ద చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర లోని నాందేడ్ నుండి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కు వెళ్తున్న పెళ్లి బృందం కారులో వెళుతున్న క్రమంలో కొండగట్టు వద్ద పెళ్లి కారును డీసీఎం వాహనం ఢీకొనడంతో దీంతో కారులో ఉన్న వరుడు తో సహా ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి మూడేళ్ల చిన్నారి రుద్ర మృతి చెందింది దీంతో వారిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు పడుతున్నారు మరి కొద్ది గంటల్లో జరగవలసిన పెళ్లి ఆగిపోయింది.వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.