
*అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన – మద్ది పూజ*
*అథ్లెటిక్స్ లో 800 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్*
*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు గ్రహీత మద్ది పూజ*
*నల్గొండ జిల్లా బ్యూరో/ చండూరు మే 28 (మన ప్రజావాణి)*:
నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల శేరిగూడెం గ్రామానికి చెందిన మద్ది లింగయ్య దనమ్మ దంపతుల కుమార్తె మద్ది పూజ గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర క్రీడ పోటీలలో అథ్లెటిక్స్ లో 800 మీటర్ల పరుగుపందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. బుధవారం బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులను అందజేయడం జరిగింది. గోల్డ్ మెడల్ సాధించిన సంతోషంలో మద్ది పూజ మాట్లాడుతూ తనకు సహకరించిన కోచ్ మాస్టర్ కు, ఉపాధ్యాయులకు, స్నేహితులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మద్ది పూజకు స్నేహితులు, ఉపాధ్యాయులు, శేరిగూడెం గ్రామ ప్రజలు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.