
ఏసీబీ కి చిక్కిన సర్వేయర్
*సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు*
*10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజు*
రాజన్నసిరిసిల్ల //మన ప్రజావాణి
లంచగొండి అధికారులు ఎలాంటి భయం లేకుండా దర్జాగా వసూళ్లకు పాల్పడుతూ అమాయకపు ప్రజల ఊసుబోసుకుంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఓ సర్వేయర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వివరాలకు వెళ్తే….. సిరిసిల్ల పట్టణం చంద్రంపేట గ్రామంలో జరుగుతున్న సర్వేయర్ల సమావేశంలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని లంచం తీసుకురావాలని సర్వేయర్ నాగరాజు డిమాండ్ చేయడంతో అక్కడికి తీసుకొని వెళ్ళగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు. నాగరాజు ని పట్టుకొని విచారిస్తున్నారు..ఏసీబీ అధికారుల దాడులతో మండలం ఉలిక్కిపడింది.