
ముస్తాబాద్ లో రోడ్డు ప్రమాదం…
•••అక్కడిక్కడే మృతి చెందిన సిద్ది రాములు
ముస్తాబాద్ //మన ప్రజావాణి
గుర్తు తెలియని వాహనం ఢీకొడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం….. ముస్తాబాద్ కి చెందిన కూర సిద్ది రాములు (53) అతని ద్విచక్ర వాహనంపై వస్తుండగా గూడూరు స్టేజి వద్ద గుర్తు తెలియని వాహనంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై గణేష్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.