
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో గందరగోళం
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో గందరగోళం
•••చీటి ఉమేష్ రావు ని స్టేజ్ దిగి వెళ్ళిపోవాలని ఆందోళన.
రాజన్న సిరిసిల్ల //మన ప్రజావాణి
చీటి ఉమేష్ రావు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సేవ చెయ్యలేదని వెంటనే స్టేజ్ నుండి దిగిపోవాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన చెశారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని సిరిసిల్ల పట్టణ లహరి గ్రాండ్ లో ఏర్పాటు చేసుకున్నారు. చీటి ఉమేష్ రావు సభను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకొని ఏనాడూ పార్టీ కి సేవ చెయ్యలేదని వెంటనే స్టేజ్ దిగి వెళ్లి పోవాలని ఆందోళన చెయ్యగ నాయకులు, పోలీసులు అదుపు చేసి శాంతింపజేశారు. అనంతరం ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి,మృత్యుంజయం సభను కొనసాగించారు.