
*జర్నలిస్టుల జాతర జలవిహార్ సభా వేదిక సర్వం సిద్ధం*
*–టీజేఎఫ్ రజతోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన – అల్లం నారాయణ*
*హైదరాబాద్ మే 30 *మన ప్రజావాణి)*:
హైదరాబాద్ లో మే 31న శనివారం జరుప తలపెట్టిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ జలవిహార్ జర్న లిస్టుల జాతర సభా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ పరిశీలించారు. టీజేఎఫ్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సంద ర్భంగా జలవిహార్ లో రజతోత్సవా లను నిర్వహిస్తున్న విషయం తెలి సిందే. ఈ ఏర్పాట్లను అల్లం నారా యణ టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆస్కాని మారుతీ సా గర్, టీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు ఎ.రమణ కుమార్, టీయూడబ్ల్యూ జే కోశాధికారి యోగానంద్, సహా య కార్యదర్శి యార నవీన్, ఐజే యు జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్ లతో కలిసి పరిశీ లించారు. సభా నిర్వహణ ప్రధాన ప్రాంగణం, వేదిక, భోజన ఏర్పాట్ల ను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తం గా తరలివస్తున్న జర్నలిస్టులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా ఏ ర్పాట్లను చేయాలని అల్లం నారా యణ నాయకులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి టీజేఎఫ్ రజ తోత్సవ సభను జయప్రదం చేయాలని కోరారు.